Wednesday, October 2, 2024
HomeతెలంగాణBirpur: నర్సింహులపల్లె గ్రామ పద్మశాలి సేవా సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

Birpur: నర్సింహులపల్లె గ్రామ పద్మశాలి సేవా సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

ఏకగ్రీవ ఎన్నిక..

జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలంలోని నర్సింహులపల్లె గ్రామంలో పద్మశాలి సంఘ భవన ఆవరణంలో పద్మశాలి  సభ్యులు అందరి సమక్షంలో  నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ పద్మశాలి సంఘ గౌరవ అధ్యక్షులుగా బొగ సత్తన్న, అధ్యక్షులుగా నరిమెట్ల సతీష్, ప్రధాన కార్యదర్శిగా కడారి లక్ష్మి నారాయణ, ఉపాధ్యక్షులుగా నరిమెట్ల రాజేష్, కోశాధికారిగా బొద్దుల నర్సయ్య ఎన్నికైనారు.

- Advertisement -

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ గ్రామంలోని పద్మశాలీల ఉన్నతికి కృషి చేస్తామని, పద్మశాలి సంఘామ్ అభ్యున్నతికి పాటుపడుతామని పద్మశాలీలంతా ఐక్యంగా ఏకతాటిపై ఉండేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  పద్మశాలి కులస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News