Monday, October 21, 2024
Homeచిత్ర ప్రభBigg Boss 8 Telugu: నన్ను ఎలిమినేట్ చేయండి సార్.. హౌస్ నుంచి వెళ్లిపోయిన మణికంఠ

Bigg Boss 8 Telugu: నన్ను ఎలిమినేట్ చేయండి సార్.. హౌస్ నుంచి వెళ్లిపోయిన మణికంఠ

Bigg Boss 8 Telugu| బిగ్ బాస్ సీజన్ 8 గత సీజన్‌ల కంటే ఈసారి రసవత్తరంగా జరుగుతోంది. ఊహించని ఎలిమినేషన్స్, సెల్ఫ్ ఎలిమినేషన్స్, వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఏకంగా 8 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి రావడం వంటి వాటితో ఈ సీజన్‌ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంది. ప్రతి వారం లాగే ఈవారం కూడా ఎలిమినేషన్ జరిగింది. అయితే ఈసారి మాత్రం సెల్ఫ్ ఎలిమినేషన్ జరిగింది. ‘దూకుడు’ సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లు ‘నాగార్జున గారూ ఎలిమినేట్‌ చేసేయండి సర్‌’ అనే డైలాగ్ సరిగ్గా సరిపోయింది. హోస్ట్ నాగార్జున ఎంత హెచ్చరించినా సరే నాగమణికంఠ(Naga Manikanta) తనకు తానుగా ఎలిమినేట్ అయి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

- Advertisement -

ఈ వారం నామినేషన్స్‌లో గౌతమ్, పృథ్వీ, నిఖిల్, యష్మీ, తేజ, మణికంఠ, నబీల్, హరితేజ, ప్రేరణలు ఉన్నారు. దీంతో ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారో అని బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఓట్ల విషయానికొస్తే అతి తక్కువ ఓట్లు వచ్చిన గౌతమ్ ఎలిమినేట్ కావాల్సి ఉంది. కానీ ఎవరూ ఊహించని విధంగా నాగమణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. అయితే తాను బిగ్ బాస్ హౌస్‌లో ఉండలేను తనను ఎలిమినేట్ చేయాలని మణికంఠ నాగార్జునను కోరాడు. అయితే నాగార్జున అతడిని హెచ్చరించాడు. ‘మనుషులు మూడు రకాలు ‘కొందరు అసలు మొదలు పెట్టరు.. మరికొందరు ప్రారంభించి ఆపేస్తారు.. ఇంకొందరు తమ లక్ష్యం సాధించే వరకూ వదలరు’ అంటూ అతడిలో స్ఫూర్తినింపే ప్రయత్నం చేశారు. అయినా తాను మాత్రం నిర్ణయం మార్చుకోలేదు. దీంతో బిగ్‌బాస్‌ సీజన్‌-8 నుంచి ఎలిమినేట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

అనంతరం వేదికపైకి వచ్చిన మణికంఠ మాట్లాడుతూ ‘‘ఎనర్జీ తగ్గిపోయింది. ఏదో నన్ను నేను నెట్టుకొస్తున్నా. ఫన్‌ టాస్క్‌ వచ్చినప్పుడు ఆలోచిస్తున్నా. ఫిజికల్ టాస్క్‌కి వస్తే, చాలా ఒత్తిడికి లోనవుతున్నా. పీకలదాకా వచ్చేసింది. మునిగిపోయినట్లు అనిపించింది. ప్రస్తుతం చాలా రిలీఫ్‌గా ఉన్నా. నాకు ఓటు వేసిన వాళ్లందరికీ క్షమాపణ చెబుతున్నా. ఏదో రకంగా వాళ్లను ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉంటా. నా ఆరోగ్యమే మహాభాగ్యం అనుకున్నా. లక్ష్మీ దేవి కంటే ఆరోగ్యం ముఖ్యం. నేను ఇక్కడకు వచ్చినప్పుడు ఎవరికీ తెలియదు. బిగ్‌బాస్‌ వేదిక మంచి అవకాశం ఇచ్చింది. ప్రేక్షకుల సహకారం వల్లే నేను ఇక్కడి దాకా వచ్చా. కానీ, నా ఆరోగ్యం నాకు ముఖ్యం. నాకు పునర్జన్మనిచ్చారు’’ అని తెలిపాడు. కాగా వారానికి రూ.1.20లక్షలు పారితోషికంతో హౌస్‌లోకి అడుగుపెట్టిన మణికంఠ.. మొత్తం 7 వారాల పాటు హౌస్‌లో ఉండటంతో అతడికి రూ.8లక్షలకు పైగానే చేతికి అందినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News