Wednesday, October 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం

Road Accident| ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వైఎస్సార్ జిల్లా పులివెందుల సమీపంలో 30 అడుగుల లోయలో ఆర్టీసీ బస్సు పడిపోయింది. పోలీసుల వివరాల ప్రకారం కదిరి నుంచి పులివెందుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో ప్రయాణికులంతా ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News