Saturday, October 5, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd: ప్రీతిని వేధించిన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు

Hyd: ప్రీతిని వేధించిన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు

వరంగల్ కేఎంసీ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి నాయక్ ఆత్మహత్యాయత్నం కేసులో నిందితులు ఎంతటి వారైనా వదిలేది లేదని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో ప్రీతి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి, సైఫ్ అనే సీనియర్ వేధింపుల కారణంగా ఆత్మహత్యయత్నకు యత్నించడం బాధాకరమన్నారు. ఈ ఘ‌టనపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ చేప‌డుతోందని తెలిపారు.

- Advertisement -

నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ వరంగల్ కమిషనర్ కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. వైద్యులతో గంట గంటకు మంత్రి హరీష్ రావు స్వయంగా మాట్లాడుతూ ప్రీతి ఆరోగ్య పరిస్థితి గురించి పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిమ్స్ డైరెక్టరుతో పాటు వైద్య బృందాన్ని ప్రీతికి మెరుగైన వైద్యం అందించేలా వైద్యుల‌ను ఆదేశించారని వెల్లడించారు. ప్రీతికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స అందిస్తున్నారని, ప్రస్తుతానికి వెంటిలేటర్, ఏఖ్మో మీద ఉన్నారని, సిఆర్ఆర్టి డయాలసిస్ ద్వారా చికిత్స అందిస్తున్నారని మంత్రి వివరించారు.

వారి తల్లిదండ్రులతో కలిసి వెళ్లినప్పుడు వారి మాటలకు ప్రీతీ కళ్ళు తెరిచి చూడగలుగుతుందని, స్వతహాగా ఊపిరి తీసుకోగలుగుతుందని మంత్రి ప్రకటించారు. ప్రీతి ఆరోగ్యంగా కోలుకొని క్షేమంగా బయటకు రావాలని మంత్రి భగవంతున్ని ప్రార్థించారు. ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా ప్ర‌భుత్వం అండగా ఉంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ హమీనిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News