Sunday, October 27, 2024
HomeతెలంగాణDrugs Party: కేటీఆర్ బామ్మర్ది ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ.. కేసు నమోదు

Drugs Party: కేటీఆర్ బామ్మర్ది ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ.. కేసు నమోదు

Drugs Party| జన్వాడలోని ఓ ఫాంహౌస్‌పై నార్సింగి పోలీసులు, సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. రిజర్వ్ కాలనీలోని రాజ్ పాకాలకు చెందిన ఫాంహౌస్ లో ఈ పార్టీ జరిగినట్లు తెలుస్తోంది. రాజ్ పాకాల.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) బామ్మర్ది అని సమాచారం.

- Advertisement -

శనివారం అర్థరాత్రి భారీ శబ్ధాలతో పార్టీ చేసుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఫాంహౌస్‌లో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ఈ పార్టీకి ఎక్సైజ్ పోలీసుల నుంచి అనుమతి తీసుకోలేదని గుర్తించారు. ఈ పార్టీలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలు ఉన్నారు. పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్ష నిర్వహించగా.. ఇందులో విజయ్ మద్దూర్ అనే పాజిటివ్‌గా నిర్థరణ అయింది. కొకైన్‌ తీసుకున్నట్లు పరీక్షలో తేలడంతో అతడిపై కేసు నమోదు చేశారు.

ఇక ఇందులో భారీగా డ్రగ్స్, విదేశీ, స్వదేశీ మద్యం స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ పార్టీలో పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసుల రాకను గమనించిన ఓ కీలక నేత అక్కడి నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించిన కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలపై సెక్షన్‌34, ఎక్సైజ్‌ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News