Saturday, June 21, 2025
HomeతెలంగాణRevanth Reddy: మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

Revanth Reddy: మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

Revanth Reddy| ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, గిరిజన నాయకులు ఊకే అబ్బయ్య(Uke Abbayya) మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంతాపం ప్రకటించారు. ఈమేరకు తెలంగాణ సీఎంవో ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.

- Advertisement -

“గిరిజన నాయకులు, శాసనసభ మాజీ సభ్యులు ఊకే అబ్బయ్య గారి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. అబ్బయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఊకే అబ్బయ్య గారు ఉమ్మడి రాష్ట్రంలో బూర్గంపహాడ్ నియోజకవర్గం నుంచి ఒకసారి, ఇల్లందు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు అమూల్యమైన సేవలందించారని సీఎం గారు గుర్తుచేశారు” అని పేర్కొన్నారు. కాగా ఆయన మరణం పట్ల పలువురు నేతలు సంతాపం తెలియజేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News