Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్AK Pradhan: గోదావరి బోర్డు నూతన చైర్మన్‌గా ఎ.కె ప్రధాన్

AK Pradhan: గోదావరి బోర్డు నూతన చైర్మన్‌గా ఎ.కె ప్రధాన్

గోదావరి నదీ యాజమాన్య బోర్డు(GRMB) నూతన చైర్మన్‌గా ఎకె ప్రధాన్(AK Pradhan) నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కేంద్ర జల సంఘంలో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. తాజాగా గోదావరి రివర్ బోర్డు చైర్మన్‌గా పదోన్నతి పొందారు. ఈమేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

కాగా ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న ముఖేశ్ కుమార్ సిన్హా కేంద్ర జల సంఘం చైర్మన్‌గా పదోన్నతి పొందిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా ఎకె ప్రధాన్ నియమితులయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News