విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ (Fees Reimbursement) ఇవ్వాలని కోరుతూ, ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని మార్చి 12వ తేదీకి వాయిదా వేస్తున్నామని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది.
ఫిబ్రవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ఫీజుపోరు నిరసన కార్యక్రమాలు ఈ మేరకు వాయిదా వేస్తున్నామని తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ ప్రకటనలో తెలిపింది.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, మా ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరినా, ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపింది. దీంతో ఆ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత, మార్చి 12వ తేదీన ‘ఫీజు పోరు’ నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు.
Fess poru postpone:వైసీసీ ‘ఫీజుపోరు’ వాయిదా
సంబంధిత వార్తలు | RELATED ARTICLES