Saturday, March 1, 2025
Homeనేరాలు-ఘోరాలుUttarakhand: ఉత్తరాఖండ్ లో కొనసాగుతున్న సహాయక చర్యలు

Uttarakhand: ఉత్తరాఖండ్ లో కొనసాగుతున్న సహాయక చర్యలు

ఉత్తరాఖండ్ (Uttarakhand) ఛమోలీ జిల్లాలో మంచు కొండలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఛమోలీ – బద్రీనాథ్ నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం పనులు చేస్తున్న కార్మికులపై ఒక్కసారిగా మంచు కొండ చరియలు విరిగిపడ్డాయి.

- Advertisement -

గల్లంతైన 57 మందిలో 49 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ముగ్గురు పరిస్థితి కొంత విషమంగా ఉండటంతో ఎయిర్ లిఫ్ట్ సహాయంతో ఆసుపత్రికి తరలించారు అధికారులు.

గల్లంతైన మరో 8 మంది కార్మికుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. ఘటన జరిగిన 24 గంటల్లోనే 49 మందిని రెస్క్యూ టీమ్ రక్షించారు.

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌లో భారీగా మంచు కురుస్తోంది. ఈ నేపథ్యంలో బద్రీనాథ్ ధామ్ హైవేపై మంచు చరియలు విరిగిపడ్డాయి. వీరంతా రోడ్డు నిర్మాణ కార్మికులుగా ఉన్నారని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News