Wednesday, April 30, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: ఏపీలో మహిళలకు భద్రత లేదు: షర్మిల

YS Sharmila: ఏపీలో మహిళలకు భద్రత లేదు: షర్మిల

దేశంలో, రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) విమర్శించారు. మహిళల భద్రతపై ఎన్ని ఫాస్ట్రాక్ చట్టాలు ఉన్నా పేరుకు తప్పా.. ఆచరణలో శూన్యమని మండిపడ్డారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

- Advertisement -

“మహిళలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. స్త్రీ లేకపోతే జననం లేదు. గమనం లేదు. అసలు సృష్టే లేదు. తల్లిగా, సోదరిగా, భార్యగా, కూతురుగా జీవితంలోని ప్రతి దశలోనూ మగవాడిని నడిపించేది మహిళ. స్త్రీ ఎక్కడ గౌరవం పొందుతుందో ఆ ఇల్లు, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుంది.

ఇవ్వాళ దేశంలో, రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. మహిళలు అంటే బీజేపీకి కనీస గౌరవం లేదు. ఓటు బ్యాంక్ కోసం మహిళలను సెకండ్ క్లాస్ సిటిజన్ కింద బీజేపీ లెక్కగట్టింది. వికసిత భారత్ లో గంటకు 50 మందిపై భౌతిక దాడులు, రోజుకి 80 మందిపై లైంగిక వేదింపులు జరగడం అత్యంత శోచనీయం. పేరుకే నారీశక్తి వందన్ అదినియమ్. ఆచరణలో మహిళలను నగ్నంగా ఊరేగించిన చరిత్ర బీజేపీది తన అనుబంధ సంఘాలది. మహిళల భద్రతపై ఎన్ని ఫాస్ట్రాక్ చట్టాలు ఉన్నా పేరుకు తప్పా.. ఆచరణలో శూన్యం.

ఇటు రాష్ట్రంలో సైతం మహిళలకు గౌరవం లేదు. గడిచిన 10 ఏళ్లలో 2 లక్షల వేధింపుల కేసులు నమోదు కావడం, గత 5 ఏళ్లలో 25 శాతం అఘాయిత్యాలు పెరగడం, 54 వేల మంది మహిళల మిస్సింగ్ కేసులు నమోదు కావడం అత్యంత దారుణం. మహిళలపై దాడులలో ఆంధ్రప్రదేశ్ నెంబర్.1 గా ఉండటం సిగ్గుచేటు. హింసకు కారణం అవుతున్న మద్యం, మత్తు పదార్థాలు అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మరోవైపు మహిళా సాధికారిత అంటూ చేస్తున్నది కూడా మోసమే. మహిళలకు ఉచిత బస్సు , నెలకు రూ.15 వందల ఆర్థిక సహాయం, సున్నా వడ్డీకే రుణాలు, తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15 వేలు లాంటి పథకాలు ఇస్తామని మహిళలకు టోకరా పెట్టారు తప్పిస్తే ఉద్ధరించింది శూన్యం.” అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News