Thursday, March 13, 2025
Homeహెల్త్Apollo CRADLE: అపోలో క్రెడిల్, ఎంఎస్డీ భాగస్వామ్యంతో.. 'టుగెదర్ ఫర్ హర్ వెల్‌ బీయింగ్’ ప్రారంభం

Apollo CRADLE: అపోలో క్రెడిల్, ఎంఎస్డీ భాగస్వామ్యంతో.. ‘టుగెదర్ ఫర్ హర్ వెల్‌ బీయింగ్’ ప్రారంభం

మహిళల ఆరోగ్యంపై అవగాహనే లక్ష్యంగా అపోలో క్రెడిల్(Apollo CRADLE), చిల్డ్రన్ హాస్పిటల్, ఎంఎస్డీ ఫార్మాస్యూటికల్స్ సంయుక్తంగా ‘టుగెదర్ ఫర్ హర్ వెల్‌ బీయింగ్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాయి. భారత్‌లో 2022లో 1.5 లక్షలకు పైగా కొత్త హెచ్పీవీ(HPV) సంబంధిత క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. సర్వైకల్ క్యాన్సర్ భారతీయ మహిళల్లో రెండో అత్యధిక క్యాన్సర్ కారణంగా నిలిచింది. ఈ అనారోగ్య సమస్యల నేపథ్యంలో బంజారాహిల్స్ లోని తాజ్ డెక్కన్ హోటల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ అపోలో క్రెడిల్, చిల్డ్రన్స్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్, ప్రసూతి, గైనకాలజీ డాక్టర్ మహితా రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి మహిళా తన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గైనకాలజిస్టును కలవడం, హెచ్పీవీ వ్యాక్సిన్ వంటి టీకాల సమాచారం తెలుసుకోవడం, స్క్రీనింగ్, నిరోధక చర్యలు పాటించడం ద్వారా మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. ఇది కేవలం చికిత్స కాదని, భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండేందుకు ముందుగా తీసుకోవాల్సిన చర్యలని తెలిపారు.

కొండాపూర్ అపోలో క్రెడిల్, చిల్డ్రన్స్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్, ప్రసూతి, గైనకాలజీ డాక్టర్ పద్మిని శిల్ప మాట్లాడుతూ.. ప్రతి మహిళ తనను తాను రక్షించుకునే శక్తిని కలిగి ఉందన్నారు. ముఖ్యంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్‌పై అవగాహన పెంచుకోవాలన్నారు. దీనివల్ల హెచ్పీవీ సంబంధిత వ్యాధులు, గర్భాశయ, గర్భాశయ క్యాన్సర్ వంటి వాటిని నివారించవచ్చన్నారు. గైనకాలజిస్టును ప్రతి ఏడాది కలవడం, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చేయాలన్నారు. లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే చర్యలు తీసుకోవడం ఉత్తమం అని తెలిపారు. ఈ చిన్నపాటి చర్యలు మహిళల ఆరోగ్యాన్ని గొప్పగా రక్షించగలవన్నారు. అందుకే ప్రతి మహిళా ముందడుగు వేయాలన్నారు. ఆరోగ్య భద్రత కోసం, భవిష్యత్తును సంరక్షించుకునేందుకు వైద్యులను సంప్రదించాలని కోరారు.‌

కొండాపూర్ అపోలో క్రెడిల్ & చిల్డ్రన్స్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ప్రసూతి, గైనకాలజీ, లాప్రోస్కోపీ & రోబోటిక్ సర్జన్ డాక్టర్ జాస్మిన్ రాథ్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం చాలా సాధారణం అన్నారు. కానీ శరీరంలో మార్పులను గమనించడం, నివారణా చర్యలు తెలుసుకోవడం, ఏటా వైద్య పరీక్షలు చేయించుకోవడం, స్క్రీనింగ్‌లో పాల్గొనడం ద్వారా మన ఆరోగ్యంపై గొప్ప ప్రభావం చూపించగలం అన్నారు. ఈరోజే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమమైన నిర్ణయం అవుతుందన్నారు.

గైనకాలజిస్టుల సిఫారసులు..

** 12 నుంచి 16 ఏళ్ల మధ్య వయస్సు వచ్చిన అమ్మాయిలు గైనకాలజిస్టును సందర్శించాలి. నెలసరి ప్రారంభం అయినా, కాకపోయినా ప్రతి సంవత్సరం వైద్యుడి వద్ద తనిఖీలు చేయించుకోవడం మంచిది.

** ప్రతి మహిళా తనకు అవసరమైన టీకాల వివరాలు తెలుసుకోవాలి. తల్లి అయిన వారు తమ పిల్లల టీకా షెడ్యూల్‌ను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. హాని కలిగించే వ్యాధుల బారిన పడక ముందే రక్షణ తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా హెచ్పీవీ వ్యాక్సిన్, ఎంఎంఆర్, హెపటైటిస్ బీ, వరిసెల్లా వంటి టీకాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.

** అవసరమైన ఆరోగ్య పరీక్షల గురించి డాక్టర్‌తో మాట్లాడడం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన చికిత్స పొందవచ్చు. పాప్ స్మియర్, బ్రెస్ట్ స్క్రీనింగ్ వంటి పద్ధతుల ద్వారా క్యాన్సర్‌ వంటి వ్యాధులను తొందరగా గుర్తించి నివారించవచ్చు.

** ఏదైనా అనారోగ్య సంకేతాలు కనిపించిన వెంటనే వైద్య సలహా తీసుకోవడం ద్వారా పెద్ద సమస్యలు రాకుండా నిరోధించవచ్చు. ‌ఆహారం, వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ, శరీర బరువు నిర్వహణ చాలా ముఖ్యం. హార్మోన్ల సమతుల్యతకు పోషకాహారం కీలకం. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ డీ, ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు గర్భాశయ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.

** ఆకుకూరలు, గింజలు, గింజల నూనెలు, పాల పదార్థాలు లేకుండా చేసే డైట్స్ హార్మోన్ల సమతుల్యతకు సహాయపడతాయి.

‌‌‌** నిరంతర ఒత్తిడి, తగిన నిద్ర లేకపోవడం వల్ల రుతు చక్రం క్రమబద్ధంగా లేకపోవడం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

‌‌‌‌** ధ్యానం, యోగా, తగిన నిద్ర వంటి జీవన శైలి మార్పులు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News