Wednesday, March 19, 2025
Homeగ్యాలరీసురక్షితంగా భూమిపైకి సునీత, విల్మోర్.. ప్రయాణం ఎలా సాగిందంటే..?

సురక్షితంగా భూమిపైకి సునీత, విల్మోర్.. ప్రయాణం ఎలా సాగిందంటే..?

సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ సహా నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. నాసా క్రూ డ్రాగన్ స్పేస్ ఫ్లైట్ వారిని క్షేమంగా భూమికి తీసుకు వచ్చింది.

- Advertisement -

క్రూ డ్రాగన్ క్యాప్సుల్ గంటకు 27,358 కిలోమీటర్ల వేగంతో వచ్చి, వేగాన్ని తగ్గించి, నాలుగు పారాచూట్‌ల సహాయంతో సముద్రంలో దిగింది.

బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు ఫ్లోరిడా సమీపంలోని సముద్ర జలాల్లో క్రూ డ్రాగన్ ల్యాండ్ అయింది.

సునీత మరియు విల్మోర్ జూన్ 5, 2024న బోయింగ్ స్టార్‌లైనర్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఎనిమిది రోజుల తర్వాత వారు తిరిగి రావాల్సి ఉండగా, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో వారు తొమ్మిది నెలలు అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చింది.

చివరకు ఎలాన్ మస్క్ యొక్క స్పేస్‌ఎక్స్ కంపెనీకి చెందిన క్రూ డ్రాగన్ వారిని సురక్షితంగా భూమికి తీసుకొచ్చింది.

భూమికి చేరుకున్న వెంటనే వ్యోమగాములను హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. (All image credit – nasa)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News