Thursday, March 20, 2025
Homeనేషనల్United Forum of Bank Unions: UFBU ఆధ్వర్యంలో రెండు రోజులు బ్యాంక్ సమ్మె

United Forum of Bank Unions: UFBU ఆధ్వర్యంలో రెండు రోజులు బ్యాంక్ సమ్మె

దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆల్ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (UFBU) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. మార్చి 23 అర్ధరాత్రి నుంచి మార్చి 25 అర్ధరాత్రి వరకు ఈ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సమ్మెను దృష్టిలో ఉంచుకొని బ్యాంక్ వినియోగదారులు నగదు లావాదేవీలను నిర్వహించుకోవాలని యూనియన్ వర్గాలు చెప్పాయి. సమ్మె గురించి మీడియా సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించాయి.

- Advertisement -

యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్‌లో మొత్తం 9 సంఘాలు ఉన్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ (INBEC), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (INBOC), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (NOBW), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (NCBE), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (NOBO) ఇందులో భాగంగా ఉన్నాయి.

బ్యాంకుల్లో 5 రోజుల పనిదినాలతో పాటు ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమకాలు చేపట్టి పని భారం తగ్గించాలని బ్యాంక్ యూనియన్లు గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (IBA)తో యునైటెడ్ ఫోరం సభ్యులు చర్చలు జరపగా విఫలమయ్యాయి. దీంతో UFBU సమ్మెకు దిగాలని నిర్ణయించింది. ఈ మేరకు సమ్మె తేదీలను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 2013 నుంచి 2024 రరకు ప్రభుత్వ రంగ బ్యంకులో 1.39 లక్షల మంది ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది. అదే సమయంలో ప్రైవేట్ బ్యాంకుల్లో 6లక్షలకు పైగా ఉద్యోగాలు పెరిగాయి. ఈ పరిణామాల నేథ్యంలో సమ్మె చేపట్టాలని నిర్ణయిచింది. సమ్మె నేపథ్యంలో ఆయా యూనియన్స్‌లో భాగంగా ఉన్న బ్యాంక్ ఉద్యోగులు నిరసనలు చేపట్టనున్నారు.

5 రోజులు పనిదినాలు, ఖాళీల భర్తీతో పాటు మరికొన్ని డిమాండ్లను UFBU లేవనెత్తింది. చాలా కాలంగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్దీకరించాలని IBAను కోరుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెర్ఫార్మన్స్ రివ్యూ.. PLI మార్గదర్శకాలను వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. అలాగే ఉద్యోగుల భద్రతకు భరోసా కల్పించాలని పట్టుబడుతోంది. గ్రాట్యుటీ చట్టాన్ని సవరించి గరిష్ట పరిమితిని రూ. 25 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించకుంటే భవిష్యత్‌లో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News