తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. విభజన సమస్యలపై దృష్టి పెట్టిన కేంద్ర హోంశాఖ.. అమరావతి-హైదరాబాద్(Amaravati-Hyderabad) గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి పచ్చజెండా ఊపింది. ఈమేరకు డీపీఆర్ రూపకల్పనకు ప్రణాళికలు రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. అలాగే పెండింగ్లో ఉన్న మరికొన్ని సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు త్వరలోనే అమరావతి రింగ్ రోడ్డుకు ఉత్తరభాగం నుంచి హైవే నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.