హరిహర వీరమల్లు’ సినిమా చూసిన పవన్ కళ్యాణ్ చాలా సంతోషించారని, దర్శకుడు జ్యోతి కృష్ణ వెల్లడి. బ్రిటిష్ వారిని పవన్ కళ్యాణ్ అడ్డుకునే యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్గా నిలుస్తాయని ధీమా. త్వరలో సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు వివరణ.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా టీమ్ మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్లో పాల్గొని అభిమానులను ఉత్తేజపరిచారు. ఈ ఈవెంట్లో దర్శకుడు జ్యోతి కృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసిన జ్యోతి కృష్ణ, పవన్ కళ్యాణ్ ఈ సినిమాను మూడు సార్లు చూసి చాలా సంతోషించారని, దాదాపు గంటసేపు సినిమా గురించి మాట్లాడారని వెల్లడించారు.
పవన్ కళ్యాణ్తో కలిసి పని చేయడం నా అదృష్టం…
“పవన్ కళ్యాణ్తో కలిసి పని చేయడం నా అదృష్టమని జ్యోతి కృష్ణ తెలిపారు. ఆయన ప్రతి ఒక్కరి టాలెంట్ను గుర్తించి, వారిని ప్రోత్సహిస్తారన్నారు. సినిమా చూశాక పవన్ అతనిని గంటసేపు అభినందించారని పేర్కొన్నారు. మళ్లీ మరో సినిమా చేద్దామని చెప్పాడం జీవితంలో మర్చిపోలేనిది,” అని జ్యోతి కృష్ణ ఉద్వేగంగా చెప్పారు. పవన్తో పని చేయడం వల్ల కొందరు అసూయపడుతున్నారని, అయినా తాను తన బాధ్యతను నిజాయతీగా నిర్వర్తించానని ఆయన అన్నారు.
నిర్మాత ఏఎం రత్నంకు కృతఙ్ఞతలు…
సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర గురించి మాట్లాడుతూ, “బ్రిటిషర్లు మన సంపదను దోచుకోవడానికి ప్రయత్నించినప్పుడు వారితో విరోచితంగా పోరడుతాడు. ఈ సీన్స్ థియేటర్లలో అద్భుతంగా కనిపిస్తాయి. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం పవన్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ‘సీజ్ ది షిప్’ స్థాయిలో ఉన్న ఈ సీన్స్ సినిమాకు హైలైట్గా నిలుస్తాయి,” అని జ్యోతి కృష్ణ వివరించారు. సినిమా బడ్జెట్ రూ.250 కోట్లకు పైగా ఉందని, ఈ సందర్భంగా నిర్మాత ఏఎం రత్నంకు కృతఙ్ఞతలు తెలిపారు.
పోర్ట్ నేపథ్యంలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్…
సినిమాలో మచిలీపట్నం 17వ శతబ్దానికి సంబందించి (బందర్) పోర్ట్ నేపథ్యంలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉందని జ్యోతి కృష్ణ తెలిపారు. ఈ పోర్టులో అద్భుతమైన సీక్వెన్స్ను రూపొందించామన్నారు. ఆ కాలం నాటి వాతావరణాన్ని రీక్రియేట్ చేయడానికి చాలా కష్టపడ్డాం,” అని ఆయన వెల్లడించారు.
అభిమానుల్లో ఆసక్తి…
‘హరిహర వీరమల్లు’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. విజువల్స్, సౌండ్ ఎలిమెంట్స్, గ్రాఫిక్స్, నేపథ్య సంగీతం, డబ్బింగ్లో ఎలాంటి రాజీ లేకుండా టీమ్ కష్టపడుతోంది. గతంలో ఈ సినిమా విడుదలను పలుమార్లు వాయిదా వేశారు. జూన్ 12న రిలీజ్ అని ప్రకటించినప్పటికీ పలు కారణాల వలన వాయిదా పడింది. త్వరలో మేకర్స్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా టీమ్ మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్లో పాల్గొని అభిమానులను ఉత్తేజపరిచారు. ఈ ఈవెంట్లో దర్శకుడు జ్యోతి కృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసిన జ్యోతి కృష్ణ, పవన్ కళ్యాణ్ ఈ సినిమాను మూడు సార్లు చూసి చాలా సంతోషించారని, దాదాపు గంటసేపు సినిమా గురించి మాట్లాడారని వెల్లడించారు.
పవన్ కళ్యాణ్తో కలిసి పని చేయడం నా అదృష్టం…
“పవన్ కళ్యాణ్తో కలిసి పని చేయడం నా అదృష్టమని జ్యోతి కృష్ణ తెలిపారు. ఆయన ప్రతి ఒక్కరి టాలెంట్ను గుర్తించి, వారిని ప్రోత్సహిస్తారన్నారు. సినిమా చూశాక పవన్ అతనిని గంటసేపు అభినందించారని పేర్కొన్నారు. మళ్లీ మరో సినిమా చేద్దామని చెప్పాడం జీవితంలో మర్చిపోలేనిది,” అని జ్యోతి కృష్ణ ఉద్వేగంగా చెప్పారు. పవన్తో పని చేయడం వల్ల కొందరు అసూయపడుతున్నారని, అయినా తాను తన బాధ్యతను నిజాయతీగా నిర్వర్తించానని ఆయన అన్నారు.
నిర్మాత ఏఎం రత్నంకు కృతఙ్ఞతలు…
సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర గురించి మాట్లాడుతూ, “బ్రిటిషర్లు మన సంపదను దోచుకోవడానికి ప్రయత్నించినప్పుడు వారితో విరోచితంగా పోరడుతాడు. ఈ సీన్స్ థియేటర్లలో అద్భుతంగా కనిపిస్తాయి. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం పవన్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ‘సీజ్ ది షిప్’ స్థాయిలో ఉన్న ఈ సీన్స్ సినిమాకు హైలైట్గా నిలుస్తాయి,” అని జ్యోతి కృష్ణ వివరించారు. సినిమా బడ్జెట్ రూ.250 కోట్లకు పైగా ఉందని, ఈ సందర్భంగా నిర్మాత ఏఎం రత్నంకు కృతఙ్ఞతలు తెలిపారు.
పోర్ట్ నేపథ్యంలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్…
సినిమాలో మచిలీపట్నం 17వ శతబ్దానికి సంబందించి (బందర్) పోర్ట్ నేపథ్యంలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉందని జ్యోతి కృష్ణ తెలిపారు. ఈ పోర్టులో అద్భుతమైన సీక్వెన్స్ను రూపొందించామన్నారు. ఆ కాలం నాటి వాతావరణాన్ని రీక్రియేట్ చేయడానికి చాలా కష్టపడ్డాం,” అని ఆయన వెల్లడించారు.
అభిమానుల్లో ఆసక్తి…
‘హరిహర వీరమల్లు’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. విజువల్స్, సౌండ్ ఎలిమెంట్స్, గ్రాఫిక్స్, నేపథ్య సంగీతం, డబ్బింగ్లో ఎలాంటి రాజీ లేకుండా టీమ్ కష్టపడుతోంది. గతంలో ఈ సినిమా విడుదలను పలుమార్లు వాయిదా వేశారు. జూన్ 12న రిలీజ్ అని ప్రకటించినప్పటికీ పలు కారణాల వలన వాయిదా పడింది. త్వరలో మేకర్స్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.