Tuesday, June 17, 2025
HomeఆటWomen's ODI World Cup 2025: వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?

Women’s ODI World Cup 2025: వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?

Women’s ODI World Cup 2025: మరో క్రీడా సమరానికి సమయం ఆసన్నమైంది. క్రికెట్ అభిమానులకు కిక్ ఇచ్చేందుకు మహిళా ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈమేరకు ఐసీసీ ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మెగా టోర్నీ 2025 సెప్టెంబర్ 30వ తేదీన ప్రారంభమై నవంబర్ 2వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ వరల్డ్ కప్ కు టీమిండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.

ఈ టోర్నీలో భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు పాల్గొననున్నాయి. అన్ని జట్లు కలిపి 31 మ్యాచ్ లు ఆడనున్నాయి. ఇక టోర్నీలో తొలి మ్యాచ్ ఆతిథ్య జట్లు అయిన భారత్, శ్రీలంక మధ్య బెంగళూరు వేదికగా సెప్టెంబర్ 30న జరగనుంది. అయితే పాకిస్తాన్ జట్టు మాత్రం తన మ్యాచ్ లు భారత్ లో కాకుండా శ్రీలంకలోని కొలంబో వేదికగా ఆడనుంది. ఇక దాయాది దేశాలైన భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య అక్టోబర్ 5వ తేదీని మ్యాచ్ జరగనుంది. భారత్ తో జరిగే మ్యాచులు బెంగళూరు, గౌహతి, ఇండోర్, విశాఖపట్నంలోని స్టేడియాల్లో జరగనుండగా.. శ్రీలంకలో జరిగే మ్యాచ్‌లు కొలంబోలో జరుగుతాయి.

ఒకవేళ పాక్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకున్నా లేదా ఫైనల్ కు వచ్చినా ఆ మ్యాచ్ కొలంబోలో జరుగుతుంది. చేరుకోకపోతే మాత్రం తొలి సెమీఫైనల్ గౌహతిలో, ఫైనల్ బెంగళూరులో జరుగుతాయి. అక్టోబర్ 29, 30వ తేదీల్లో సెమీ ఫైనల్స్.. నవంబర్ 2న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

వరల్డ్ కప్ లో టీమిండియా ఆడే మ్యాచుల షెడ్యూల్ ఇదే..

సెప్టెంబర్ 30: ఇండియా వర్సెస్ శ్రీలంక(బెంగళూరు)
అక్టోబర్ 5: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (కొలంబో)
అక్టోబర్ 9: ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా (వైజాగ్)
అక్టోబర్ 12: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (వైజాగ్)
అక్టోబర్ 19: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ (ఇండోర్)
అక్టోబర్ 23: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (గౌహతి)
అక్టోబర్ 26: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (బెంగళూరు)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News