Petrol & Diesel Prices hike: ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం (Israel and Iran War) కారణంగా క్రూయిడ్ ఆయిల్ (Crude Oil) ధరలకు రెక్కలు వచ్చాయి. శనివారం బ్యారెల్కి 6 డాలర్లకు పైగా పెరిగి 78 డాలర్లను దాటింది. ఇది ఐదు నెలల గరిష్టం కావడం విశేషం. ఈ ముడిచమురు ధరలు పెరగడం వల్ల ఇంధన ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది. దీంతో సరుకు రవాణా వ్యయం కూడా పెరుగనుంది. ముఖ్యంగా భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయంగా వీటి ధరలు పెరిగిన వెంటనే భారత్లోనూ చమురు సంస్థలు పెట్రోల్ మరియు డీజిల్ ధరలను పెంచేస్తాయి. దీంతో అల్టిమేట్గా ఇది వినియోగదారుడిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
ఈ యుద్ధం సమీపకాలంలో ముగిసే అవకాశం లేదు. దీంతో చమురు, గ్యాస్ ధరలు కాడా భారీగా పెరుగుతాయని అనుమానిస్తున్నారు. ఇప్పటికే దేశంలో పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. ప్రస్తుత ధరతోనే సామాన్య ప్రజలు లబోదిబోమంటున్నారు. డీజిల్ ధర వందకు సమీపంలో ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఈ ధరల పెంపు వాహనదారులకు గుదిబండే అని చెప్పాలి.
పలు నగరాల్లో చమురు ధరలు: నిన్నటి రేట్లు జూన్ 16న హైదరాబాద్లో (Hyderabad Petrol Price) పెట్రోల్ ధర రూ. 107.46గా ఉంది. ఇక డీజిల్ ధర రూ. 97.70గా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.77గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.87.67గా ఉంది. అయితే ముంబయి నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.50 ఉండగా.. డీజిల్ ధర రూ.90.03గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.100.80, డీజిల్ ధర రూ.92.39గా ఉంది.
రోజు రోజుకు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ముదురుతుండటంతో పెట్రోల్ ధరలు కచ్చితంగా పెరుగుతాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే క్రూయిడ్ ఆయిల్ ధరలు పెరగడం ఇందుకు ఉదాహరణగా వాళ్లు చెప్పుకొస్తున్నారు. అంతర్జాతీయ క్రూయిడ్ ధరలతో పెట్రోల్, డీజీల్ ప్రైజ్ ముడిపడి ఉండటంతో వీటికి రెక్కలు వచ్చే అవకాశం ఉంటుంది.