ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 4వ రోజుకి చేరింది. రెండు దేశాలు ప్రతి దాడితో పరిస్థితి మరింత భీకరంగా మారింది. ఇరు దేశాల దాడులతో భారీ సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాటు రెండు దేశాల్లో అధికారిక, పౌర భవనాలు నేలమట్ట అయ్యాయి. నిన్న ఇరాన్ ప్రయోగించిన మిస్సైల్ దాడిలో ఇజ్రాయెల్లో 8 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ ప్రయోగించిన మిస్సైల్ ఇజ్రాయెల్లోని అమెరికా రాయబారి కార్యలయాన్ని తాకింది. అయితే ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కేవలం కార్యాలయ భవనం స్వల్పంగా దెబ్బతిందని అధికారులు వెళ్లడించారు.
యుద్ధం మొదలైన నుంతి 4వ రోజునే ఇరాన్ రాజధాని అయినా టెహ్రాన్పై తమకి పట్టు దొరికిందని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఈ క్రమంలోనే యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో యుద్ధం కారణంగా ఇప్పటి వరకు 24 మంది మరణించారు. అంతే కాకుండా 500 మందికి పైగా గాయాలు జరిగాయి.
ఇదే సమయంలో ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన కాల్పులు కేవలం ప్రారంభం మాత్రమేనని ఆ దేశం తెలిపింది. తమ లక్ష్యాలు ఇంకా పూర్తి కాలేదని హెచ్చరించింది. ఇరాన్లో తీవ్ర ప్రాణనష్టం జరగకూడదంటే ప్రజలని సురక్షిత ప్రదేశానికి తరలించాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది.
ఇదే సమయంలో అణువ్యాప్తి నిరోదక ఒప్పందం (NPT) నుంచి వైదొలిగేందుకు పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెడతామని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అణ్వాయుధాల తాయారి.. వాటి ప్రోత్సాహానికి ఇరాన్ ఎన్నటికి వ్యతిరేకమని అదే ప్రకటనలో తెలిపింది.
ఇజ్రాయెల్పై యుద్ధాన్ని నియంత్రించేందుకు అమెరికాపై ఒత్తిడి తేవడానికి గల్ఫ్ దేశాల సహకారం కోసం ఇరాన్ ప్రయత్నిస్తోంది. తద్వార అమెరికా అద్యక్షుడు ట్రంప్పై ఒత్తిడి చేసి యుద్ధం నివారణకు ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్ దేశాలను సహాయం కోరుతూ ఇరాన్ ప్రభుత్వం లేఖలు రాసింది. ఇక శనివారం ఇజ్రాయెల్ జరిపిన కాల్పులలో సుమారు 6 మంది అను శాస్త్రవేత్తలు మరణించార ఇరాన్ మీడియా తెలిపింది.
Israel Iran War: తారాస్థాయికి ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం.. తీవ్రంగా హెచ్చరించిన ఇజ్రాయెల్!
సంబంధిత వార్తలు | RELATED ARTICLES