రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరో నాలుగు రోజులు ఇదే ట్రెండ్ కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల గాలులు బలంగా ఉంటాయని, కొన్ని సందర్భాల్లో గంటకు 40-50 కి.మీ. వేగంతో వీస్తాయని చెప్పింది.
సాయంకాలం వేళల్లో కొన్ని జిల్లాల్లో పొడి వాతావరణం మాత్రమే ఉండగా.. మరికొన్ని జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. హైదరాబాద్ లో నేడు సాయంత్రం వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
నైరుతి రుతుపవనాలు ఇప్పటికే దేశం మొత్తం విస్తరించాయి. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు నిన్న మహారాష్ట్రలో కూడా నిన్న భారీ వర్షం నమోదైంది. రాబోయే వారంలో రుతుపవనాల జోరు మరింత పెరగనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.