Wednesday, June 18, 2025
Homeనేషనల్Maharashtra: స్కూళ్ళలో హిందీ తప్పనిసరేం కాదు..!

Maharashtra: స్కూళ్ళలో హిందీ తప్పనిసరేం కాదు..!

పాఠశాలలో హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలి అనే కీలకమైన అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం వెన్నకు తగ్గింది. ప్రతీ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులు అందరూ తప్పనిసరిగా హిందీ నేర్చుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు వెనక్కి వేసింది. తాజాగా విడుదల చేసిన స్టేట్‌మెంట్‌ ప్రకారం హిందీ నేర్చికోవడం అనేది తప్పనిసరి కాదని ఆ రాష్ట్ర విద్యా శాఖ అధికారికంగా వెల్లడించింది.

- Advertisement -

రాష్ట్ర స్థాయిలో హిందీ తప్పనిసరి అనే అంశంపై వచ్చిన వ్యతిరేకత ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వెంటనే స్పందించిన ప్రభుత్వం ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గింది.

నేడు మహారాష్ట్ర విద్య శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో హిందీ తప్పనిసరి అనే పదాన్ని తొలగించింది. హిందీ బదులు మరో భాషను ఎంచుకునే అవకాశాన్ని సైతం విద్యార్థులకు కల్పించింది. ఏ భాషను ఎంచుకోవాలన్నా ప్రతీ తరగతిలో కనీసం 20 మంది విద్యార్థులు ఆ భాషను ఎంపిక చేసుకోవాలనే నిబంధనను పెట్టింది. అందుకు తగినట్లుగానే భాషను బోధించడానికి ఉపాధ్యాయులను నియమిస్తామని.. ఒకవేళ ఉపాధ్యాయులు అందుబాటులో లేని పక్షంలో ఆన్‌లైన్‌ ద్వారా తరగతులు జరుగుతాయి అని వెల్లడించింది.

ప్రస్తుతం జాతీయ విద్య విధానంలో భాగంగా త్రిభాషా సూత్రం ప్రకారంగా ప్రతి విద్యార్థి తమ పాఠశాల దశలోనే హిందీ, ఇంగ్లీష్, ఒక స్థానిక భాషను నేర్చుకోవాలని కేంద్రం పేర్కొంది. అయితే ఈ అంశం పైన తమిళనాడు ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేసింది. ద్విభాషా సూత్రానికి కట్టుబడి ఉంటాం అని.. ఎటువంటి పరిస్థితుల్లో హిందీ బాషని పరిగణలోకి తీసుకోమని అటువంటి సందర్భమే వస్తే ఉరుకునేదే లేదఅని డీఎంకే స్పష్టం చేసింది.

ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం హిందీ బాషా తప్పనిసరి అని ప్రకటించింది. కానీ రాష్ట్ర స్థాయిలో ఈ నిర్ణయం వ్యతిరేకత ఒక కారణం అయితే మరోవైపు ‘మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన ‘ అధ్యషులు రాజ్ ఠాక్రే మరియు ఉద్దవ్ ఠాక్రే కూడా ఈ విషయం పైన వ్యతిరేకతని వ్యక్తం చేశారు. ఇందువల్లనే మహారాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెన్నకి తీసుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News