Ts weather updates: రాష్ట్రంలో నేడు రేపు తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోందని పేర్కొంది. పశ్చిమ నైరుతి దిశల నుంచి 30 నుంచి 40 కీ.మీ వేగంతో వీస్తున్న గాలుల వల్ల అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతోందని తెలిపింది.
నిన్న గురువారం నాడు రాష్ట్రంలో మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, మేడ్చల్-మల్కాజిగిరి,సంగారెడ్డి భూపాలపల్లి, వికారాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ , ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్,నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసినట్టు వెల్లడించింది.
మధ్య భారతదేశంలో ఎల్ పీ ఏ బలపడటం వలన ఈ నెల 23 నుంచి తెలంగాణలో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నిన్న తెలిపింది. గంటకు 40 – 50 కి.మీ వేగంతో బలమైన గాలులు విస్తాయని పేర్కొంది.
నిన్నటితో పోలిస్తే నేడు హైదరాబాద్ లో సాయంత్రం నుంచి రాత్రి సమయంలో కాస్త తక్కువగా చిరు జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించి. దాంతో పాటు రాష్ట్రంలోని ఇతర చోట్ల కూడా వాతావరణం చల్ల బడి అక్కడక్కడా చిరు జల్లులు కురుస్తాయని తెలిపింది.
రాబోయే రోజుల్లో భారీ వర్షాలు:
రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కొన్ని జిల్లాల్లో నిన్న సాయంత్రం పొడి వాతావరణం మాత్రమే ఉంది. మరికొన్ని జిల్లాల్లో కొద్ది పాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే దేశం మొత్తం విస్తరించాయి. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే వారంలో రుతుపవనాల జోరు మరింత పెరగనుందని భారత వాతావరణ కేంద్రం కూడా తెలిపింది.