Tuesday, June 24, 2025
HomeఆటDilip Doshi Death: టీమిండియా మాజీ క్రికెటర్ దిలీప్ దోషి కన్నుమూత

Dilip Doshi Death: టీమిండియా మాజీ క్రికెటర్ దిలీప్ దోషి కన్నుమూత

Former India cricketer Dilip Doshi Passes away: టీమిండియా మాజీ క్రికెటర్ దిలీప్ దోషి(77) గుండెపోటుతో కన్నుమూశారు. చాలా కాలంగా కుటుంబంతో లండన్ లో నివసిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతి పట్ల బీసీసీఐ సంతాపం ప్రకటించింది.

- Advertisement -

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన దిలీప్ 238 మ్యాచుల్లో 898 వికెట్లు తీశారు. ఈ లెజండరీ లైఫ్టార్మ్ లెగ్ స్పిన్నర్ 1979-1983 మధ్య భారత్ తరపున 33 టెస్టులు ఆడి 114 వికెట్లు, 15 వన్డేల్లో 22 వికెట్లు పడగొట్టారు. టెస్టుల్లో ఆరుసార్లు ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్స్ తీశారు. ఈయన వన్డేల్లో 3.96 ఎకానమీతో బౌలింగ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News