Anushka Shetty: టాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్గా నిలిచే హీరోయిన్స్ కొందరే. అలాంటి వారిలో అనుష్క శెట్టి ముందు వరుసలో ఉంటుంది. నిశ్శబ్దం డిజాస్టర్ తర్వాత కాస్త గ్యాప్ తీసున్న ఈ ముద్దుగుమ్మ 2023లో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో సక్సెస్ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడీ లేడీ సూపర్స్టార్త తన రాబోయే సినిమా ‘ఘాటి’పై భారీ ఆశలు పెట్టుకున్నారు. తన కెరీర్కు కీలకం కానున్న ఈ సినిమా విషయంలో ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సక్సెస్ జర్నీని కంటిన్యూ చేయాలని అనుష్క భావిస్తోంది. అందుకోసం గతంలో తన లేడీ ఓరియెంటెడ్ సినిమాల విషయంలో సూపర్ హిట్ అయిన ఒక ఫార్ములాను స్వీటీఇప్పుడు ‘ఘాటి’ కోసం రిపీట్ చేస్తుండటం విశేషం. క్రిష్ దర్శకత్వంలో, అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఎక్కువగా యాక్షన్, వైలెన్స్తో నిండిన సన్నివేశాలనే హైలైట్ చేసింది. దీంతో ‘ఘాటి’ ఒక పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్గా ఉంటుందని, తీవ్రమైన టోన్లో సాగుతుందని ప్రేక్షకులు అందరూ భావించారు.
అనుష్క శెట్టి అభిమానులు, ఆడియెన్స్ అందరూ ఘాటి మూవీ వయొలెంట్గా ఉంటుందని భావిస్తున్నారు. స్వీటీని ఇప్పటి వరకు చూడనటువంటి మాస్ అవతార్లో చూడబోతున్నామని భావించారు. అయితే, చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన లేటెస్ట్ అప్డేట్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది, అంచనాలను మార్చేసింది.
‘ఘాటి’ మూవీ నుంచి ఓ జాతర నేపథ్యంలో వచ్చే సైలోరే అనే ఫోక్ సాంగ్ను విడుదల చేశారు. ఇందులో అనుష్క, విక్రమ్ ప్రభు (Vikram Prabhu) నటించారు. ఈ పాటను చూస్తుంటే ఘాటి సినిమాలో కేవలం యాక్షనే కాకుండా, హీరో, హీరోయిన్ల మధ్య ఒక ఆసక్తికరమైన లవ్ ట్రాక్కు కూడా ప్రాధాన్యత ఉంటుందని టీమ్ చెప్పకనే చెప్పేసింది.
అనుష్క గతంలో బ్లాక్బస్టర్గా నిలిచిన ‘భాగమతి’ (Bhaagamathie) సినిమాను గమనిస్తే అందులోనూ ‘భగ భగ భగ భాగమతి’ అంటూ ప్రేక్షకులను భయపెట్టిన అనుష్క అదే సినిమాలో ‘మందార మందర’ పాటతో రొమాంటిక్ కోణాన్ని కూడా అద్భుతంగా చూపించారు. ఓ వైపు మాస్, ఇంటెన్సిటీ మరో వైపు రొమాంటిక్ లవ్ యాంగిల్తో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. స్వీటీ అనుష్క ఇప్పుడు ‘ఘాటి’ విషయంలోనూ అదే హిట్ ఫార్ములానే మళ్ళీ సక్సెస్ తెస్తుందని ఎంతో నమ్మకంతో ఉన్నారు.మరి అనుష్క ప్లానింగ్ వర్కవుట్ అవుతుందో లేదో తెలుసుకోవాలంటే వెయిట్ చేయాల్సిందే.