Nagarjuna – Ravi Teja – Naga Chaitanya: అభిమానుల గుండెల్లో దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో చక్రం తిప్పుతూ స్టార్ డమ్ను సంపాదించుకుని మన హీరోలు ఇప్పుడు తమ కెరీర్లో గుర్తుండిపోయే ల్యాండ్ మార్క్ మూవీస్ను అందించటానికి రెడీ అవుతున్నారు. వారి కెరీర్లో మైలురాళ్ళుగా నిలిచిపోయే సినిమా కోసం ఎంతో జాగ్రత్తగా స్పెషల్ కాంబినేషన్స్ని సెట్ చేసుకుంటున్నారు కొందరు ఇప్పటికే సెట్స్పై ఉంటే కొందరు సెట్ చేసుకోవటానికి అడుగులేస్తున్నారు. ఇప్పుడదే హాట్ టాపిక్గా మారింది.
మైల్ స్టోన్ మూవీ చేయబోతున్న హీరోల్లో లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సింది నాగార్జున గురించి. ఈ అక్కినేని కథానాయకుడు తన కెరీర్లో మైల్ స్టోన్ మూవీ చేయబోతున్నారు. అదే ఆయన 100వ సినిమా. సీనియర్ స్టార్స్లో ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ సెంచరీ క్లబ్లో ఎప్పుడో చేరిపోయారు. నాగ్ సెంచరీ క్లబ్లో ఎప్పుడెప్పుడు చేరుతాడా? అని అభిమానులు సహా అందరూ ఎదురు చూస్తున్నారు. సినీ సర్కిల్స్లో వినిపిస్తోన్ సమాచారం మేరకు తమిళ దర్శకుడు కార్తీక్తో తన మైల్స్టోన్ చిత్రాన్నిచేయబోతున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అంతా ఓకే అనుకున్న తర్వాతే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయని టాక్.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/anushka-shetty-follows-hit-formula-for-ghati/
ప్రభాస్ ఈ మధ్య సినిమాలు చేయటంలో జోరు పెంచేసిన సంగతి తెలిసిందే. మన పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ మైల్ స్టోన్ మూవీ 25వ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఆయన వరుస క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. గత ఏడాది జూన్లో విడుదలైన కల్కి కల్కి 2898 AD ప్రభాస్కు 23వ సినిమా. కాగా డార్లింగ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్ 24వ ప్రాజెక్ట్ ఇది డిసెంబర్ 5న వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే ప్రభాస్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా రాబోతున్న చిత్రం ఫౌజీ. ఇది ప్రభాస్ 25వ సినిమా. హను రాఘవపుడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. నిజానికి స్పిరిట్ మూవీ ప్రభాస్కు 25వ సినిమా అవుతుందని అందరూ భావించారు. అయితే రిలీజ్ ప్రకారం చూస్తుంటే ఫౌజీ సినిమానే డార్లింగ్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా నిలవనుంది. ఆ లెక్కన స్పిరిట్ ప్రభాస్ కెరీర్లో 26వ సినిమాగా నిలవనుంది. సలార్ 2, కల్కి 2 వంటి పెద్ద ప్రాజెక్ట్స్ ను ప్రభాస్ ఇంకా క్యూలో పెట్టున్నారు.
ఇక మాస్ ఆడియెన్స్లో స్పెషల్ క్రేజ్ ఉన్న హీరో రవితేజ. ఈయన కూడా తన 75వ సినిమా మాస్ జాతరను ఆడియెన్స్ ముందుకు తీసుకు రావటానికి రెడీ అవుతున్నారు. ఆగస్ట్ 27న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇందులో శ్రీలీల కథానాయిక. భాను భోగవరపు అనే డెబ్యూ డైరెక్టర్తో సినిమా చేస్తుండటం విశేషం. ధమాకా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ, శ్రీలీల కలయికలో రాబోతున్న సినిమా ఇది.
కెరీర్లో సిల్వర్ జూబ్లీ సినిమా చేయబోతున్న మరో హీరో నాగ చైతన్య. ఈ అక్కినేని నట వారసుడు తన 25వ సినిమాను డైరెక్టర్ శివ నిర్వాణతో చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన కార్తీక్ దండుతో 24వ మూవీని చేస్తున్నారు. ఇది సెట్స్లో ఉండగానే శివ నిర్వాణ మూవీని ట్రాక్ ఎక్కించటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. చైతన్యతో ఇది వరకే మజిలీ వంటి బ్లాక్బస్టర్ ఇచ్చిన శివ నిర్వాణ మరో హిట్ మూవీ చేయాలని ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే చైతుకి కథ చెప్పి, 25వ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారని సమాచారం.ఈ స్టార్ హీరోలందరూ అభిమానులకు సరికొత్త వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మైలురాళ్ళ సినిమాలు ఎలాంటి రికార్డులు సాధిస్తాయో చూడాలి మరి.