Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు భారీగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సమాచారం. ప్రణీత్ రావు అండ్ టీమ్ సుమారు 4013 మంది ఫోన్ నంబర్లను ట్యాప్ చేశారు. వీరిలో 618 మంది రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్, పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్కు గురయ్యాయి.
రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, బండి సంజయ్ కుటుంబ సభ్యులు, ఈటెల రాజేందర్ ఆయన కుటుంబ సభ్యులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు అనుచరుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి. త్వరలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మైనం పల్లి హనుమంత్ రావు, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మర్రి శశిధర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, తాటి కొండ రాజయ్యలను విచారించేందుకు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. ఐఏఎస్లు రోనాల్డ్ రాస్, గౌతంల ఫోన్లు సైతం ట్యాపింగ్కు గురయ్యాయి. 618 మంది స్టేట్మెంట్ను సిట్ రికార్డు చేయనుంది. ఇప్పటి వరకు 228 మందిని విచారించిన సిట్ వారి స్టేట్మెంట్లను రికార్డు చేసింది.
ALSO READ: https://teluguprabha.net/technology-news/shubhanshu-shukla-travel-to-space-axiom-4/
‘ఫోన్ ట్యాపింగ్ ద్వారా తాను ఎవరితో మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది తెలుసుకొని.. తద్వారా 2018 ఎన్నికల్లో తనను ఓడించే ప్రయత్నం జరిగింది’ అని బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. మంగళవారం సిట్ విచారణకు హాజరైన ఈటల ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంక్వైరి నత్తనడకన కొనసాగుతోందని విమర్శించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నిబంధనలను తుంగలో తొక్కి.. కేసీఆర్ కోసం పని చేశారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్లతో పాటు వారి కుటుంబసభ్యులు, పీఆర్ఓలు, గన్మెన్లు, కార్యకర్తల ఫోన్లను ట్యాప్ చేశారని ఆయన పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలోనూ ఫోన్ ట్యాప్ చేశారన్నారు. తమపై అధికారుల ఆదేశాల మేరకే ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు ఫోన్ టాపింగ్ చేశామని చెబుతున్నారని గుర్తుచేశారు. రాజకీయ నాయకులతో పాటు సినిమా రంగం, వ్యాపారవేత్తల ఫోన్లను సైతం ట్యాప్ చేశారని చెప్పారు. ఈ వ్యవహారంలో తనకు అనుకూలంగా ఉన్నవారిని కేసీఆర్ నియమించుకున్నారని తెలిపారు. ‘ప్రభాకర్ రావుకు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఎస్ఐబీలో ఉద్యోగం ఇచ్చారు.. ఇది బాధ్యతారాహిత్యం’ అని ఈటల అన్నారు.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/kcr-are-you-ready-for-the-debate-on-banakacharla-in-the-assembly-says-revanth/
కాగా, మూడోసారి అధికారంలోకి రావడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు, ఫోన్ ట్యాపింగ్ రెండు తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించిన సంగతి తెలిసిందే.
Phone Tapping Case Update: 4013 మంది ఫోన్ నంబర్లు ట్యాప్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES