Thursday, June 26, 2025
HomeTS జిల్లా వార్తలుMlc Kavitha Challenge To CM: ఎన్నికల హామీలపై చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కవిత...

Mlc Kavitha Challenge To CM: ఎన్నికల హామీలపై చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కవిత సవాల్

kavitha Comments: అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆరు గ్యారెంటీల అమలు, మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసంపై చర్చిద్దామా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కూతరు కవిత సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి చంద్రబాబును పిలిచి హైదరాబాద్ బిర్యాని పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్‌గా ఇచ్చారని కవిత ఆరోపించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ 2016లో పోలవరం, బనకచర్ల అంశమే లేదన్నారు. రేవంత్ రెడ్డికి అబద్దాలు ఆడడం అలవాటైందని కవిత విమర్శించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడం సరికాదని హితవు పలికారు. ‘ఎస్.. అసెంబ్లీ పెడుదాం… ఆరు గ్యారెంటీల అమలు, మహిళలను మోసం చేసినదానిపై చర్చిద్దాం.




కేసీఆర్ దమ్మెంతా అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అది మరిచిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడడం బాధాకరం’ అని కవిత అన్నారు. కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరురేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించాలని సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని మండిపడ్డారు.


ALSO READ: https://teluguprabha.net/telangana-news/misunderstanding-between-congress-leaders-for-jubileehills-seat-for-by-elections/

కాగా, కాంగ్రెస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కవిత ప్రశ్నించారు. మహిళలకు 2500, పెన్షన్ల పెంపు ఇతర హామీల అమలుపై ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో సోనియా గాంధీకి వేలాది పోస్టు కార్డులను అబిడ్స్ జీపీవోలో తెలంగాణ జాగృతి కార్యకర్తలు సమక్షంలో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని కవిత విమర్శించారు. వృద్ధులకు రూ 2 వేల పెన్షన్‌ను రూ 4 వేలు చేస్తామన్న హామీని కాంగ్రెస్ విస్మరించిందన్నారు. వికలాంగుల పెన్షన్‌ను రూ.4 వేల నుంచి రూ.6 వేల‌కు పెంచకుండా మోసం చేసిందని మండిపడ్డారు. గ్యారెంటీలపై సోనియా గాంధీ సంకతం పెట్టిన గ్యారెంటీ కార్డులను ఇంటింటికి పంచారని, సోనియాగాంధీ ముఖం చూసి ఓట్లేసిన మహిళలను, వృద్ధులను, వికలాంగులను మోసం చేశారని విమర్శించారు. మోసం చేశారు కనుకే సోనియా గాంధీకి వేలాది పోస్టు కార్డులు పంపించామన్నారు.

ALSO READ: https://teluguprabha.net/telangana-district-news/brs-government-tapped-over-4013-numbers-belongs-revanth-and-bandi-sanjay/


‘గోదావరి, కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చ పెడదాం.. దమ్ముంటే రా’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. నిన్న సెక్రటరియేట్ వద్ద జరిగిన రైతు భరోసా సంబురాల్లో సీఎం రేవంత్ కేసీఆర్‌పై ఫైర్ అయిన విషయం తెలిసిందే. కేసీఆర్ ఓకే చెప్పిన తర్వాతే ఏపీ ప్రభుత్వం బనకచర్లపై వేగంగా నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టు ఆగిపోవడానికి కారణం ఎవరో అందరికీ తెలుసని, కేసీఆర్ కుట్రల వల్లే రాష్ట్రంలో ప్రాజెక్టులు ఆగిపోయాయని రేవంత్ విమర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News