Sunday, October 6, 2024
HomeతెలంగాణMandamarri: సీతారామచంద్ర స్వామి కల్యాణంలో కలెక్టర్ దంపతులు

Mandamarri: సీతారామచంద్ర స్వామి కల్యాణంలో కలెక్టర్ దంపతులు

మందమర్రి పట్టణంలో శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలోని మిథిలా ప్రాణంగంలో శ్రీ సీతరామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండగ వాతావరణంలో వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణ మహోత్సవంలో సీతారామచంద్ర స్వాములకు పట్టువస్త్రాలను సమర్పించి కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు. మందమర్రి సిఐ, తహశీల్దార్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నలువాల సమ్మన్న యాదవ్, పురోహితులు అనంతచారి, అలయ పురోహితులు కృష్ణ చైతన్య ఆచార్య, టీబీజీకెఎస్ నాయకులు శంకర్ రావు, కొమ్ము రాజన్న, రమసాని శేఖర్, బిఆర్ఎస్ సోషల్ మీడియా నాయకులు కూకట్ల తిరుపతి యాదవ్, రేగుల శ్రీనివాస్ సుజాత, ల్యాగల రవి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News