జనగామ ఎస్సై దంపతులు ఆత్మహత్య చేసుకోవటం సంచలనం సృష్టిస్తోంది. ఎస్సై భార్య ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాక, కాసేపట్లోనే తన సర్వీస్ రివాల్వర్ తో ఎస్సై శ్రీనివాస్ ప్రాణాలు తీసుకున్నారు. భార్య మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే ఎస్సై ఇలా తుపాకీతో కాల్చుకుని చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. కాగా నిన్న రాత్రి ఎస్సై, ఆయన భార్య మధ్య గొడవలు జరిగినట్టు చుట్టుపక్కలవారు వెల్లడించారు. శ్రీనివాస్ పిల్లలు హైదరాబాద్ లో ఉద్యోగాలు చేసుకుంటుండగా వీరిద్దరే జనగామలో ఉంటున్నారు.
Janagama: ఎస్సై దంపతుల ఆత్మహత్య
సంబంధిత వార్తలు | RELATED ARTICLES