Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్ Emmiganuru: 'జగనన్నే మా భవిష్యత్తు' ప్రారంభం

 Emmiganuru: ‘జగనన్నే మా భవిష్యత్తు’ ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్త్, మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమాన్ని ఎమ్మిగనూరు పట్టణంలో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ప్రారంభించారు.  చేనేత కుటుంబ సభ్యుల ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు, ప్రజల సమస్యలును అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

ఆయన ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కోసం వివరించారు. జగనన్న ప్రభుత్వం ఎలా ఉంది ఏ విధంగా పరిపాలన ఉంది  జగనన్నకు మీరందరూ మద్దతుగా ఉంటూ ప్రతి ఒక్కరు జగన్నను  ఆశీర్వదించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు నేరుగా ప్రజల వద్దకే  ప్రజల వద్దకే మంచి పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి , ప్రజలు మాటలలో జగనన్నకు ఎప్పుడూ ప్రజలు రూణపడి ఉంటారనే లక్ష్యంతో ప్రజలున్నారన్నారు ఎమ్మెల్యే.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ ఆహ్మద్, బుట్టారంగయ్య,  రియాజ్ ఆహ్మద్, పట్టణ జేసీఎస్ కన్వీనర్ బంగి శ్రీరామ్, వైసిపి వార్డు ఇన్ చార్జ్ వాల్మీకి వినయ్ కుమార్, కౌన్సిలర్ శివ ప్రసాద్, మన్సూర్ బాషా, కన్వీనర్లు, గృహసారథులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News