Saturday, October 5, 2024
HomeతెలంగాణHyd: అంబేద్కర్ విగ్రహ శిల్పిని సన్మానించిన మంత్రులు

Hyd: అంబేద్కర్ విగ్రహ శిల్పిని సన్మానించిన మంత్రులు

హుస్సేన్ సాగర్ తీరాన నెలకొల్పిన డా. బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఘన ప్రారంభోత్సవం చేశారు.  ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు ఈ సందర్బంగా విగ్రహాన్ని రూపొందించిన విగ్రహ శిల్పి మహారాష్ట్రకు చెందిన అనిల్ సుతార్ ను మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా సత్కరించారు. మెమొంటో అందజేసి, శాలువాతో సన్మానించారు. ఆయనకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. (ప్రధానశిల్పి రామ్ సుతార్ 100 ఏండ్లు పైబడిన పెద్ద మనిషి ఇవాళ్టి కార్యక్రమానికి హాజరు కాలేక పోయారు)

- Advertisement -

ఆర్ అండ్ బి శాఖ అధికారులు, కేపీసి నిర్మాణ సంస్థ ప్రతినిధులు కలిసి రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ లను శాలువాతో సన్మానించారు. తమకు విలువైన సూచనలు చేస్తూ, అందర్నీ సమన్వయం చేస్తూ తమకు అన్ని విధాల తోడ్పాటు, మనోధైర్యాన్ని ఇచ్చిన మంత్రులకు వారు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News