Sunday, October 6, 2024
HomeతెలంగాణKeerthi Suresh: మహిళలు వ్యాపార రంగంలో విజయం సాధించాలి

Keerthi Suresh: మహిళలు వ్యాపార రంగంలో విజయం సాధించాలి

మహిళలు వ్యాపార రంగంలో విజయం సాధించాలని ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ అన్నారు. బొల్లారం పారిశ్రామిక వాడలోని నూతనంగా ఏర్పాటు చేసిన సంయుక్త మాడ్యులర్ ఇండస్ట్రి ప్రైవేట్ లిమిటెడ్ ని ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ నటి కీర్తి సురేష్ మాట్లాడుతూ తన సినిమాలు చూసి తనను ఆదర్శంగా తీసుకుని సంయుక్త ఒక మాడ్యులర్ కిచెన్ ఇండస్ట్రీ స్థాపించి తన చేతుల మీదుగా ప్రారంభం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

- Advertisement -

చిన్న వయస్సు లోనే ఇండస్ట్రీ స్థాపించడం అభినందనీయం అన్నారు.సంయుక్త మాడ్యులర్ ఇండస్ట్రి యజమాని సంయుక్త మాట్లాడుతూ తాను కీర్తి సురేష్ అభిమానిని, త్వరలో మరో యూనిట్ కూడా కీర్తి సురేష్ మేడం చేతుల మీదుగా ప్రారంభం కానుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ చంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ కొలన్ రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్, మాజీ ఎంపీటీసీ రాగాల లక్ష్మి నాయుడు, దుర్గా దేవి, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News