Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుKarimnagar: కేసుల పరిష్కారంలో SHOs

Karimnagar: కేసుల పరిష్కారంలో SHOs

వివిధ రకాల కేసుల పరిష్కారంలో పోలీస్ స్టేషన్లకు చెందిన పరిపాలన అధికారులు ఎస్ హెచ్ఓలకు సహాయకారులుగా ఉండాలని కరీంనగర్ అడిషనల్ డిసిపి జి. చంద్రమోహన్ అన్నారు. కమిషనరేట్ లోని వివిధ పోలీస్ స్టేషన్లలో పరిపాలన అధికారులుగా పనిచేస్తున్న పోలీసులు ఎస్ హెచ్ఓ లతో సమానమైన విధినిర్వహణ భాద్యతలను నిర్వర్తించాలని చెప్పారు. కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో వివిధ పోలీస్ స్టేషన్లలో పరిపాలన అధికారులుగా (ఏఓ) పనిచేస్తున్న వివిధస్థాయిలకు చెందిన పోలీసులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ డిసిపి పరిపాలన చంద్రమోహన్ మాట్లాడుతూ ఎస్ హెచ్ఓ లు అందుబాటులో లేకున్నా దృష్టికి వచ్చిన సమస్యలు, ఫిర్యాదులను స్వీకరిస్తూ వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సత్వర స్పందన, వేగవంతంగా సేవలందించేందుకు వివిధ రకాల పనివిభాగాలు (వర్టికల్స్) ఏర్పాటులో భాగంగా ఈ పరిపాలన అధికారులు విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీస్ స్టేషన్లలోని అన్ని విభాగాల పనితీరుపై అవగాహన కలిగిఉండాలని చెప్పారు. వేగవంతంగా పనిచేయడం ద్వారా ఆశించిన ఫలితాలు వస్తాయనే విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. కాలానికనుగుణంగా సేవల్లోనూ వినూత్న ఒరవడితో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. తమ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఏదైనా నేరఛేదనకు సంబంధించిన సమాచారం ఉన్నట్లయితే క్రైం బృందాలకు తమవంతు సహకారం అందించాలని తెలిపారు.

- Advertisement -

నేరాల ఛేదనలో కీలక పాత్రపోషించే వారికి వెంటనే రివార్డులను అందజేస్తామని ప్రకటించారు. వివిధ విభాగాల పనితీరులో లోపాలు ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకవెళ్ళాలని సూచించారు. అంకితభావం, పరస్పర సహకారంతో ముందుకు సాగినట్లయితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లక్ష్యసాధనలో సఫలీకృతం అవుతామని విషయాన్ని గుర్తించాలని చెప్పారు. ప్రజలకు సత్వరం సేవలందించడం ద్వారా పోలీస్ శాఖ ప్రతిష్ట పెంపొందించేందుకు దోహదపడుతుందని చెప్పారు. ప్రజలకు రేయింబవళ్ళు సేవలందించేందుకు క్షేత్ర స్థాయి అధికారులని అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 5ఎస్ కార్యక్రమం అమలుతీరును ప్రతిరోజు పర్యవేక్షించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల ఆవరణను అహ్లాదకరంగా రూపొందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలకు సుహృద్భావమైన వాతావరణం కల్పించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్బిఐ జి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News