Friday, September 20, 2024
HomeతెలంగాణKhammam: కాంగ్రెస్ కు కంచు కోట ఖమ్మం

Khammam: కాంగ్రెస్ కు కంచు కోట ఖమ్మం


తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం జిల్లాకి ప్రత్యేకత ఉందని కాంగ్రెస్ కు ఖమ్మం కంచుకోట అని మాజీ శాసనసభ్యులు వేం నరేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, మహమ్మద్ జావేద్ లు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఎన్నో ఏండ్లుగా నిరుద్యోగ యువత స్టడి రూమ్ ల చుట్టూ తిరుగుతూ కుటుంబాలని వదిలి రేయింబవళ్ళు కష్ట పడి చదువుతుంటే ప్రభుత్వం వారి పట్ల కనికరం లేకుండా ఉద్యోగాలను అమ్మే ప్రయత్నం చేసిందని అన్నారు. నిందితులను పట్టుకోవడంలో కూడా ప్రభుత్వం అంతా సీరియస్ గా ప్రయత్నం చేయలేదని పేపర్ లు కొన్న వాళ్లే బయటకి వచ్చి మేమే పేపర్ లు కొన్నామని చెప్పారు తప్పా ప్రభుత్వ చేసిందేమీ లేదన్నారు.
కేసీఆర్ మన నీళ్ళు మన నిధులు, మన నియామకాలు అంటూ మా నీళ్ళు, మా నిధులు, మా నియామకాలు అనే స్థాయికి చేరుకున్నారని అందులో భాగంగానే నేడు ఉద్యోగాలు అమ్ముకుంటూన్నారని అన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క ఆధ్యర్యంలో నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని అన్నారు. ఈ నెల 24న ఖమ్మం పట్టణంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ నిరసన ర్యాలీ తో రాష్ట్ర ప్రభుత్వ వెన్నుల్లో వణుకు పుట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొనున్నట్టు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ పట్టణంలో ఇల్లందు క్రాస్ రోడ్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు సంబాని చంద్రశేఖర్,టీపీసీసీ ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వరావు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనా రెడ్డి,టిపిసిసి సెక్రటరీ మానవతా రాయ్,పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరావు,మహ్మద్ జావేద్,పుచ్చకాయల వీరభద్రం,జిల్లా అనుబంద సంఘ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్,దొబ్బల సౌజన్య,బొడ్డు బొందయ్య,మొక్కా శేఖర్ గౌడ్,రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల,మాజీ శాసన సభ్యులు తాటి వెంకటేశ్వర్లు,నగర కాంగ్రెస్ కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు,దుద్దుకూరి వెంకటేశ్వర్లు,లకావత్ సైదులు నాయక్,పల్లెబోయిన చంద్రం,మిక్కినేని నరేందర్,ముస్తఫా,రామసహాయం మాధవి రెడ్డి, యర్రం బాలగంగాధర్ తిలక్,మద్ది శ్రీనివాస రెడ్డి,నున్నా నాగేశ్వరరావు,వెంకటరత్నం,రామూర్తి నాయక్,కట్ల రంగారావు,బెల్లంకొండ శరత్,బ్లాక్,మండల,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తదితర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News