మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా దర్గా వద్ద ప్రార్థనకు వెళ్ళిన వారిపైన తేనెటీగలు దాడి చేయగా పది మందికి గాయాలయ్యాయి. పవిత్రమైన రంజాన్ ఈద్-ఉల్-ఫితర్ పండుగ సందర్భంగా మండల కోఆప్షన్ సభ్యులు మునవ్వర్ తన కుటుంబ సభ్యులతో దర్గా బావి వద్ద ప్రార్థన కొరకు వెళ్ళారు. అక్కడకు వెళ్లిన సమయంలో వారిపై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో దాదాపు పది మందికి పైగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం మేడ్చల్ లోని మెడినోవా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి అక్కడకు చేరుకొని వారిని పరామర్శించారు. పండుగ రోజు ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరమని వారన్నారు.
Medak: తేనెటీగల దాడి, 10మందికి గాయాలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES