Friday, September 20, 2024
HomeతెలంగాణHyd: అమిత్ షావి అన్నీ అబద్ధాలే

Hyd: అమిత్ షావి అన్నీ అబద్ధాలే

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిన్న చేవెళ్ల సభలో అన్ని అబద్దాలు చెప్పారని మండిపడ్డారు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్. మంత్రుల నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన వినోద్.. తెలంగాణ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఎంత మోసం చేస్తుందో బీజేపీ రాష్ట్ర నాయకులకు ఎందుకు కనిపించడం లేదో..? ఆదాయ లెక్కలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి , బండి సంజయ్ కి పంపిస్తా.. కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి. బీజేపీకి మతాల మధ్య చిచ్చు పెట్టె పని తప్ప ఇతర ఏ పని లేదంటూ వినోద్ భగ్గుమన్నారు. కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కి సవాల్ చేస్తున్నా… తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి దేశంలో బిజెపి పాలిత రాష్ట్రాలలో కానీ, ఏ రాష్ట్రంలో అయిన ఉందా.. ఉంటే చూపండి అంటూ వినోద్ సవాలు విసిరారు.

- Advertisement -

ఫలానా రాష్ట్రం బాగుందని మీరు చూపిస్తా అంటే నేను వస్తా..రాజకీయాలు వేరు అభివృద్ధి వేరని వినోద్ హితవు పలికారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అన్న విషయాన్ని మరువద్దన్నారు. స్వల్ప కాలంలో తెలంగాణ అభివృద్ధి జరగటాన్ని గమనించాలన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల వాళ్ళు హైదరాబాద్ కి వచ్చి సింగపూర్ కి వచ్చామా.. అని ఆశ్చర్య పోతున్నారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాజారాం యాదవ్, గొట్టిముక్కల వెంకటేశ్వర రావు కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News