Tuesday, May 20, 2025
HomeతెలంగాణSuryapeta: మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Suryapeta: మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు పిలుపునిచ్చారు. గురువారం నేరేడుచర్ల పట్టణంలో భవన నిర్మాణ కార్మికులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికులందరూ మేడే నాడు నిర్వహించే భారీ ర్యాలీ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. వెల్ఫేర్ బోర్డు లోని నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఖర్చు చేయకుండా పక్కదారి మళ్ళిస్తున్నారని, లేబర్ కోడ్ లను కేంద్ర ప్రభుత్వం సవరణలు చేస్తున్నారని, కార్మికులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక తీరును ఎండగట్టే ప్రయత్నం చేయాలన్నారు. కార్మికుల హక్కులను కాపాడుకునే బాధ్యత ప్రతి కార్మికుడి కి ఉందన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ నీలారామ్మూర్తి, సిపిఎం పట్టణ కార్యదర్శి కొదమగుండ్ల నగేష్, కుంకు తిరుపతయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు యారవ శ్రీనివాస్, సత్తార్, రవీందర్, బిక్షం, నాగరాజు, నాగుల్ మీరా, శ్రీను, ఖాజావలి, బుడేసాహెబ్, సైదులు, నాగమ్మ, రామకృష్ణ, దుర్గారావు, తదితర భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News