పాములపాడు మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను నంద్యాల జిల్లా కలెక్టర్ మన్ జీర్ జిలాని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాములపాడులోని తాసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆర్బికే సెంటర్ ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు రికార్డులను తనిఖీ చేసి, అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఉద్యోగులు టైం ప్రకారం విధులకు హాజరుకావాలని, ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులను పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సమయ పాలన పాటించి విధులకు హాజరుకావాలని లేదంటే చర్యలు తప్పవని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/05/03ef2a01-dd92-49a1-b865-4fc7dacd51bf-1024x467.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/05/2b379131-4b7e-4704-b6ce-8b029ffb93e7-1024x467.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/05/96546bc6-3c59-451f-9a26-ff9fc1670540-1024x467.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/05/e1609b74-c438-490a-819c-27e566d2ecf0-1024x467.jpg)