Friday, September 20, 2024
HomeతెలంగాణGudem Mahipal Reddy: గ్రామాల అభివృద్ధికి పెద్దపీట

Gudem Mahipal Reddy: గ్రామాల అభివృద్ధికి పెద్దపీట

సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి పల్లె ప్రగతికి నిదర్శనంగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామంతో పాటు దాచారం, కిష్టాయిపల్లి, అల్లినగర్ లలో 2 కోట్ల 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

- Advertisement -

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తూ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు వివిధ పరిశ్రమల సహకారంతో సిఎస్ఆర్ నిధులను కేటాయిస్తూ గ్రామాలను అభివృద్ధికి ప్రతీకలుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, గ్రామ సర్పంచ్ ప్రకాష్ చారీ, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులు రాజేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News