Friday, October 18, 2024
Homeఓపన్ పేజ్World honeybee day: తేనెటీగలతోనే మానవ మనుగడ

World honeybee day: తేనెటీగలతోనే మానవ మనుగడ

తేనెటీగలకు మానవ మనుగడకు సంబంధం ఏమి టి అని ఆశ్చర్యంగా ఉందా! అవును తేనెటీగ లకు మానవ మనుగడకు అవినాభావ సంబంధం ఉంది. అవిశ్రాంతంగా పనిచేసే తేనెటీగలు ప్రజలకు, మొక్కలకు, మరియు పర్యావరణానికి చేసే ప్రయోజనాన్ని వెల కట్ట లేము. అందుకే ఎన్నో శతాబ్దాలుగా భూగ్రహం మీద శ్రమైక జీవనానికి ప్రతీకలుగా నిలుస్తున్న తేనెటీగల గురిం చి ఉటంకిస్తూ భూమి ఉపరితలం నుండి తేనెటీగలు అదృ శ్యమైతే, మానవులు నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం మనుగడ సాగించలేరు అని అన్నారు ప్రఖ్యాత ఆంగ్ల కవి ఆల్బర్ట్‌ ఐన్‌ స్టీన్‌. పుప్పొడిని ఒక పువ్వు నుండి మరొక పువ్వుకు చేరవేయడం ద్వారా, తేనెటీగలు మరి యు ఇతర పరాగ సంపర్క జీవులు సమృద్ధిగా పండ్లు, కాయలు మరియు గింజల నాణ్యతకు, ఉత్పత్తికి దోహదం చేయడమే కాక జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో కూడా కీలక భూమిక వహిస్తాయి.
తేనెతీగల చరిత్ర
తేనెటీగలు అపిడే కుటుంబానికి చెందిన ఎగిరే కీటకాలు. తేనెటీగలు భూమ్మీద 34 మిలియన్‌ సంవత్స రాల క్రితం నుంచి మనుగడలో ఉన్నాయని భావిస్తారు. తేనెని దాదాపు 8 వేల యేళ్ళ క్రితం వాలెంసియా, స్పె యిన్‌లోని ఆరానా గుహల్లో కనుగొన్నారని అంటారు. ఆ తర్వాత ఈజిప్ట్‌ లో తూటంఖమూన్‌ రాజు సమాధి లోపల 3వేల యేళ్ళ క్రితం పెట్టిన కుండలు కనుగొన్నారు. ఆయన స్వర్గ లోకంలో ప్రయాణానికి అవి అవసరం అని వారు భావించారు.దానికి ముందే 5500 యేళ్ళ క్రితం జార్జియా లో తవ్వకాల్లో తేనె పాత్రల ఆచూకీ లభ్యమైంది. అందుకే ఎన్నేళ్లయినా చెక్కు చెదరని, పాడవని ఆహారంగా పరి గణించబడుతుంది తేనె.
పర్యావరణ పరిరక్షణలో…
పర్యావరణ పరిరక్షణకు అద్వితీయంగా తోడ్పాటు నందించే తేనెటీగల కోసమే ప్రత్యేకంగా మే 20వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా తేనెటీగల దినోత్సవం జరుపుకుం టారు. ఈ సంవత్సరపు ప్రపంచ తేనె దినోత్సవ వేడుకలు మే 20న మధ్యప్రదేశ్‌ లోని బాలాఘాట్‌ లో ప్రారంభం కానున్నాయి. నిజానికి తేనెటీగలు ఒక రకమైన తుమ్మె దలు. తేనెటీగలు ఆర్థికపరంగా మానవులకు సహాయపడు తున్న ఉత్పాదక కీటకాలు. వ్యవసాయపరంగా ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు. మన ఆహార భద్రత, పోషణ మన పర్యావరణ పరిరక్షణలో తేనెటీగలు, పరాగ సంప ర్కాల పాత్ర చాల ముఖ్యమైనది. వివిధ రకాల పువ్వుల నుండి పుప్పొడిని సేకరించి ఇతర పువ్వులపై వాలడం ద్వారా ఇవి పరపరాగ సంపర్కానికి ఎంతో దోహదపడ తాయి. ఈ ప్రక్రియ ద్వారా పండ్లు, కూరగాయలు, నూనె గింజలు వంటి తదితర ఉత్పత్తుల నాణ్యత, దిగుబడి పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 115 ప్రముఖ ఆహార పంటలలో 87 పరాగసంపర్కం చర్య ద్వారా ఉత్పత్తి కాగా మొత్తం పంట ఉత్పత్తిలో పరాగ సంపర్కాలు 35 శాతం ఉత్పత్తికి కారణమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా మానవు లకు ఆహారంగా ఉపయోగపడే వివిధ రకాల తిండి గిం జలు, పండ్ల పంటల సాగులో దాదాపు 75 శాతం పంటలు పరాగ సంపర్కాలపై ఆధారపడతాయంటే ఒకింత ఆశ్చర్యం కలుగక మానదు. తేనెటీగలు జీవవైవిధ్యాన్ని కాపాడటంలో కూడా ఎంతో మేలు చేస్తాయి. తేనెటీగలు పూలనుండి మకరందాన్ని సేకరించి తేనెపట్టులో ఉంచి తేనెగా మారుస్తాయి. ఇవి సంతానోత్పత్తి కోసం తేనెపట్టును ఏర్పరచుకొంటాయి. అయితే ఇటీవలి సర్వేల ప్రకారం కేవలం గత రెండు సంవత్సరాలలో 90 శాతం తేనెటీగలు అంతరించిపోయాయని తెలియడం అత్యంత ఆందోళన కలిగించే పరిణామం. విచక్షణారహితంగా అడవుల నరికి వేత, తేనెతెట్టెలు పెట్టడానికి అనువైన వృక్షాలు లేకపోవ డం, వివిధ పుష్పజాతులు అంతరించిపోవడం, అనియం త్రిత కలుపు మరియు క్రిమిసంహారక మందుల వినియో గం తేనెటీగలు అంతరించిపోవడానికి కారణమవుతు న్నాయి. ఆర్ధిక పరంగా చూస్తే పంటల పరాగ సంపర్కా లుగా తేనెటీగల ఆచరణాత్మక విలువ అవి ఉత్పత్తి చేసే తేనె మరియు మైనం విలువ కంటే చాలా ఎక్కువ.
శ్రమైక జీవులు
తేనె శరీరానికి ఎంతో మేలు చేస్తుందని మనలో చాలా మందికి తెలుసినప్పటికీ తేనె తయారీ కోసం తేనెటీగల జీవితకాల కృషి ఇందులో ఇమిడి ఉందని మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. తేనెటీగలు ఒక చెంచా తేనెను తయారు చేయడానికి అనేక వేల కిలోమీటర్లు ఎగరవలసి ఉంటుంది. మొత్తం జీవిత కాలంలో ఒక తేనెటీగ ఒక చెంచా తేనెను కూడా తయారు చేయలేదు. ప్రతి తేనెటీగ తన జీవితకాలంలో ఒక టీస్పూన్‌లో కేవలం పన్నెండవ వంతు వరకు మాత్రమే తేనెను తయారు చేస్తుంది. అంటే 12 తేనెటీగలు జీవితాంతం కష్టపడితే ఒక చెంచా తేనె తయారవుతుంది. మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే కేవలం ఆడ తేనెటీగలు మాత్రమే తేనెను తయారు చేస్తాయి. మగ తేనెటీగలు ఏ పని చేయక ఆడ తేనెటీగలు ఎక్కువగా ఉన్న చోట ఉంటాయి. తేనెటీగ సగటు జీవిత కాలం 45 రోజు లు మాత్రమే. ఒక కిలో తేనెను తయారు చేయడానికి అందులో నివసించే తేనెటీగలు దాదాపు 40 లక్షల పువ్వుల రసాన్ని పీల్చుకుని 90,000 మైళ్లు ప్రయాణించ వలసి ఉంటుంది. పుప్పొడిని మోసుకెళ్లడానికి అనుగుణంగా ఆడ తేనెటీగలు ప్రత్యేక శరీర నిర్మాణ నిర్మా ణాలను కలిగి ఉంటాయి. సాధారణంగా స్వల్పకాలం జీవించే మగ తేనెటీగలు సంతాన సంరక్షణ మరియు పుప్పొడి సేకరణ లాంటి ఎటువంటి బాధ్యతలను నిర్వహించవు.
తేనెటీగల సహనివేశం సాధారణంగా ఒక రాతికి గాని, భవనం పైకప్పు మరియు గోడకు మధ్య అనుసంధా నంగా ఉండే బీమ్‌ కు గాని లేదా చెట్టు శాఖలకు గాని తేనెపట్టును నిర్మిస్తాయి. ఒక్కొక్క సహనివేశంలో దాదాపు 50,000 తేనెటీగలు ఉంటాయి. ఒక్కొక్క తేనెపట్టులో మైనంతో చేసిన రెండు రకాల షడ్భుజాకారపు కక్ష్యలు అనేకం ఉంటాయి. మొదటి రకం షడ్భుజాకారపు కక్ష్యలో తేనెను, పుప్పొడి రేణువులను నిల్వ చేయడానికి రెండవ రకం షడ్భుజాకారపు కక్ష్యలో పిండ సంరక్షణకు ఉప యోగపడతాయి. ఇవి కాక రాణీ ఈగ కోసం పెద్ద కక్ష్య ఒకటి ఉంటుంది. పిండ రక్షణ కక్ష్యలో అండాలుంటాయి. పుప్పొడి రేణువులే పిండదశలో ఆహారం. పిండ దశ నుండి కొత్త ప్రౌఢ ఈగలొస్తాయి. ఒక తేనెటీగల సహనివేశంలో మూడు రకాలు అనగా రాణి ఈగలు, డ్రోన్‌ లు మరియు కూలి ఈగలుంటాయి. ఒక్కొక్క తేనెపట్టు లో ఒక రాణి ఈగ ఉంటుంది. ఒకవేళ, పొరపాటున రెండు రాణి ఈగలు ఉంటే, ఒకటి మరో దానిని చంపేస్తుంది. రాణి ఈగలు ఒక రకమైన రసాయనాన్ని ఉత్పత్తిచేస్తాయి. అది కూలి ఈగలు సంతానోత్పత్తిపరమైన అభివృద్ధి చెందకుండా నిరోధి స్తుంది. దినమంతా గదులను పర్యవేక్షించే రాణి ఈగ రోజుకు 2000 వరకు గుడ్లను పెడుతుంది. వాటి నుండి 1-2 రోజుల తరువాత డింభకాలు బయటికి వస్తాయి. కూలి ఈగలు డింభకాలకు తేనె, పుప్పొడి, రాయల్‌ జెల్లీని అందిస్తాయి. రాయల్‌ జెల్లీని ఎక్కువగా త్రాగిన డింభ కాలు, రాణి ఈగలుగా మారుతాయి. 5 వ రోజుకు డింభ కాలు తమ చుట్టూ, ఒక గట్టి పొరను నిర్మించుకుంటాయి. కూలి ఈగలు గదిని మైనంతో మూసివేస్తాయి. మూడు వారాలలో పూర్తిగా ఎదిగిన తేనెటీగలు గదిని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేస్తాయి.
తేనె ఎంతో రుచికరమైన మరియు పోషక విలువలు గల ఆహరపదార్థం. సాంప్రదాయకంగా, తేనె కంటి వ్యాధులు, శ్వాసనాళ ఉబ్బసం, గొంతు ఇన్ఫెక్షన్లు, క్షయ, దాహం, ఎక్కిళ్ళు, అలసట, మైకము, హెపటైటిస్‌, మల బద్ధకం, పురుగుల ముట్టడి, పైల్స్‌, తామర, పూత మరియు గాయాలను నయం చేయడంతో పాటు బలవర్ధక పోషకాహారంగా కూడా ఉపయోగించబడుతుంది. తేనె టీగ విషాన్ని కీళ్ళ నొప్పుల చికిత్సలో ఉపయోగిస్తారు. తేనెటీగల నుండి సేకరించే ప్రొపోలిస్‌ ద్రావకాన్ని హోమి యోపతి మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఇదే కాకుండా ఆయుర్వేదంలో ఎన్నో మందులను తేనే తో కలిపి ఇవ్వటం వల్ల ఆ మందు త్వరగా జీర్ణం అయి త్వరగా పని చేస్తుందని భావిస్తారు. భస్మాలను అంటే పొడులను తేనే లో రంగరించి తింటారు. విటమిన్‌ బి, సి, ఇంకా పొటాషియం వంటివి ఇందులో ఉంటాయి.
కుటీర పరిశ్రమగా తేనెటీగల పెంపకం
అదనపు ఆదాయం కోసెం కేవలం కొద్దిపాటి వన రులు స్వల్ప పెట్టుబడితో రైతులు వ్యవసాయాధారిత పరి శ్రమ అయిన తేనెటీగల పెంపకాన్ని చేపట్టవచ్చు. తేనెటీ గల పెంపకానికి మరియు మైనం తయారీకి భూసారంతో పని లేదు. ఇందుకు బంజరు భూములైనా సరిపోతుంది. పర్యావరణం పై సానుకూల ప్రభావం చూపే తేనెటీగలు పొద్దుతిరుగుడు, నువ్వులు, ఆవ లాంటి పంటలతో పాటు పూలు పూచే మొక్కలలో పరపరాగ సంపర్కానికి సహాయ కారిగా నిలవడంతో పాటు వివిధ రకాల పండ్ల జాతులలో అధిక దిగుబడికి దోహదం చేస్తాయి. తేనె మరియు మైనానికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. తేనెటీగల పెంపకాన్ని ఎవరికి వారు వ్యక్తిగతంగా కానీ లేదా బృందం గా కానీ ఏర్పడి చేపట్టవచ్చు.
రైతుల జీవితాలను మార్చేందుకు సహాయపడే మధు క్రాంతి లేదా తీపి/తేనె విప్లవం కోసం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివాసీలు, రైతులు, నిరుద్యోగ యువత మరియు మహిళలకు తేనెటీగల పెంపకం ద్వారా ఉపాధిని సృష్టించడంతో పాటు భారతదేశ తేనె ఉత్పత్తిని కూడా పెంచడం ఈ విప్లవం యొక్క ముఖ్యోద్దేశం. దీని ద్వారా ప్రాథమిక తేనెటీగల పెంపకం మరియు తేనె వెలికి తీత పధతులను బోధించడమే కాకుండా, ఖాదీ మరియు విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కమీషన్‌ మరియు పూణే లోని ఉన్న సెంట్రల్‌ బీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా రైతులను ఎంపిక చేసి వారికి అధునాతన శిక్షణను అందిస్తుంది. ఈ శిక్షణ లో భాగంగా తేనెటీగల నుండి పుప్పొడి, రాయల్‌ జెల్లీ మరియు విషాన్ని వేరు చేయడం, మెరుగైన వృక్షజాలం కోసం వారు తమ తేనెటీగలతో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించడం లాంటి విషయాలలో మెళకు వలు నేర్చుకుంటారు. తేనెటీగలు పువ్వుల నుండి తేనెను పీల్చినప్పుడు వాటి కాళ్ళపై సేకరించే పుప్పొడి మరియు క్రిటర్లు స్రవించే రాయల్‌ జెల్లీలో పుష్కలంగా ఉండే ప్రోటీ న్లను తరచుగా పోషక పదార్ధాలలో ఉపయోగిస్తారు. తేనెటీ గల నుండి సేకరించిన పుప్పొడికి మార్కెట్లో కిలోకు దాదాపు రూ.1200, రాయల్‌ జెల్లీకి రూ.25 నుండి రూ.30 వేల వరకు ధర పలుకుతుంది.
తేనెటీగల పెంపకానికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు
వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖా పరిధి లోని నేషనల్‌ బీ బోర్డ్‌ (ఎన్‌ బీ బీ) ఈ పథ\కాన్ని అమలు చేస్తోంది. వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్‌ బీ బోర్డ్‌ (ఎన్‌బీబీ) ఈ పథకాన్ని అమలు చేస్తోంది. 2020 నుంచి 2023 వరకు 3 ఏళ్ల పాటు ఇది అమలులో ఉంటుంది. దేశంలో శాస్త్రీయ పద్ధతి లో తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభు త్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. తేనెటీగల పెంప కా నికి సంబంధించిన్‌ ఇతర పథకాలైన ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ మిషన్‌, హనీ మిషన్‌, మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్మెంట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలు, ఎం ఎస్‌ ఎం ఇ, ఆయుష్‌ తదితర వాటితో కలిసి ఈ స్కీం పని చేస్తుంది.
యేచన్‌ చంద్ర శేఖర్‌
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్‌ స్కౌట్స్‌, గైడ్స్‌, తెలంగాణ

- Advertisement -
  • 8885050822

(నేడు ప్రపంచ తేనెటీగల దినోత్సవం)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News