Thursday, April 17, 2025
HomeతెలంగాణYadadri: గ్రామాల్లో మౌలిక సదుపాయాలకై కృషి

Yadadri: గ్రామాల్లో మౌలిక సదుపాయాలకై కృషి

ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. మండలంలోని ఆరూరు శ్రీ మత్స్యగిరిగుట్ట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రతి కాలనీలో తిరుగుతూ ప్రజలను పలు సమస్యలను అడిగి తెలుసుకొని, ప్రతి సమస్యకు మార్గాన్ని తెలిపారు. శ్రీ మత్స్యగిరి గుట్ట కొండపైకి మెట్ల గుండా ఘాటు రోడ్డును నిర్మించాలని అభివృద్ధి కమిటీ విజ్ఞప్తి మేరకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందించి రోడ్డుకు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చిట్టేడి జయమ్మ జనార్దన్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్లు చిట్టేడి వెంకట్రాంరెడ్డి,సురకంటి వెంకట్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి మొగ్గుల్ల శ్రీనివాస్, శ్రీరాముల నాగరాజు, పిఆర్ ఏఈ సుగుణాకర్,జింకల దానయ్య, కొడితాల నాగరాజు, మర్రి వెంకన్న, బాలేందర్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News