Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Odisha: ఒడిశా రైలు ప్రమాదపై జగన్‌ ఉన్నత స్థాయి సమీక్ష

Odisha: ఒడిశా రైలు ప్రమాదపై జగన్‌ ఉన్నత స్థాయి సమీక్ష


ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీఎం వైయస్‌.జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎంఓ కార్యాలయ అధికారులతో కలిసి.. ఈ ప్రమాద ఘటనపై ఆయన సమీక్షించారు. తాజా సమాచారం ప్రకారం 237 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. క్షతగాత్రుల సంఖ్యకూడా భారీగా ఉందని వివరించారు.

  • సీఎం ఆదేశాలమేరకు తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు.
  • ప్రమాద ఘటన జరిగిన ప్రాంతం పరిధిలోని డీఆర్ఎం అధికారి నుంచి సమాచారం తెప్పిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
  • అలాగే ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో కూడా నిరంతరం టచ్‌లో ఉన్నామని వెల్లడించారు.
  • పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌ అధికారులతో ఒక బృందాన్ని ప్రమాదం జరిగిన బాలాసోర్‌ ప్రాంతానికి పంపించాలని సీఎం ఆదేశించారు.
  • మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తోపాటు సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌
    విశాఖలో కమర్షియల్‌ ట్యాక్స్‌ జాయింట్‌ కమిషనర్‌ ఆనంద్‌, శ్రీకాకుళం జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌లతో కూడిన బృందం వెళ్తోందని అధికారులు తెలిపారు.
  • ప్రతి జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో కూడా ఎంక్వైరీ విభాగాలను ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశాలతో ఆమేరకు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని అధికారులు తెలిపారు.
  • రైల్వే అధికారులనుంచి అందిన ప్రయాణికుల పరిస్థితులపై ఆరాతీయడానికి, అలాగే ఎవరైనా ప్రయాణికుల బంధువులు, వారి సంబంధీకుల నుంచి సమాచారం వస్తే వెంటనే స్పందించేలా ఈ ఎంక్వైరీ విభాగాలు పనిచేయాలని సీఎం ఆదేశించారు.
  • దీంతో పాటు ఒడిశా సరిహద్దులకు సమీపంగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాల్లో అవసరమైన పక్షంలో అంబులెన్స్‌లు పంపించడానికి సిద్ధంగా ఉంచాలని సీఎం ఆదేశించారు.
  • క్షతగాత్రులకు అవసరమైన పక్షంలో ఉత్తమ వైద్యం అందించడానికి విశాఖ సహా ఒడిశా సరిహద్దుల్లోని ఆస్పత్రులను సన్నద్ధంగా ఉంచాలని కూడా సీఎం అధికారులను ఆదేశించారు.
  • ప్రమాద ఘటనకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News