Sunday, September 22, 2024
HomeదైవంBethamcharla: శ్రీవిష్ణునామ స్తోత్ర అఖండ మండల జప పారాయణ యజ్ఞం

Bethamcharla: శ్రీవిష్ణునామ స్తోత్ర అఖండ మండల జప పారాయణ యజ్ఞం

ఆర్ధిక రూపేణా, వస్తు రూపేణా, శ్రమ రూపేణా ఈ యజ్ఞానికి తోడ్పాటు అందించిన వారందరికీ కృతజ్ఞలు

బేతంచెర్ల పట్టణం శ్రీ పూదోటమఠంలో శ్రీవిష్ణునామ స్తోత్ర అఖండ మండల జప పారాయణ యజ్ఞం మే 21న ప్రారంభమై, ఈనెల 30వ తేదీ నాటికి (41రోజులు) ముగుస్తుంది. అందులో భాగంగా ఈ మంగళవారానికి 17 రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పూదోట మఠం నిర్వాహకులు ఈశ్వర ప్రసాద్, గుండాగోపాల్, గౌరీహుసేన్ రెడ్డి, ప్రభాకర శర్మ, సముద్రాల రామకృష్ణయ్య, బుగ్గనవిశ్వనాధరెడ్డి, మఠం నాగిరెడ్డి డాక్టర్, ఎవి నరసింహులు మాట్లాడుతూ.. ఈ యజ్ఞానికి ఆర్ధిక రూపేణా, వస్తు రూపేణా, శ్రమ రూపేణా తోడ్పాటునందించిన వారందరికీ కృతజ్ఞలు తెలుపుతూ, రాబోయే పారాయణ యజ్ఞం రోజులలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, శ్రీ విష్ణు నామస్తోత్ర అఖండ మండల జప పారాయణా యజ్ఞంను జయప్రదం చేయాలని, నిర్వాహాక ముఖ్యులు గుండాగోపాల్, జప పారాయణ యజ్ఞ బృందం సభ్యులు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News