Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుTandur: భూ తగాదాలతో తమ్ముడిని చంపిన అన్న

Tandur: భూ తగాదాలతో తమ్ముడిని చంపిన అన్న

భూమి పంపకానికి సహకరించడం లేదని సోదరుడినే చంపిన అన్న

భూ తగాదాలతో తమ్ముడిని గొడ్డలితో నరికి చంపిన అన్న. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా యలాల్ మండలంలో చోటుచేసుకుంది. తాండూరు రూరల్ సీఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా యాలాల మండలం నాగ సముందర్ గ్రామానికి చెందిన గుబ్బ లక్ష్మయ్య కి ముగ్గురు కుమారులు కృష్ణ, వెంకటేష్, రవి, ఇద్దరు కూతురులు ఉన్నారు. తండ్రి లక్ష్మయ్య పేరు మీద ఉన్న ఐదు ఎకరాల భూమిని చిన్న కొడుకు ఆయన రవి వ్యవసాయం చేసుకుంటున్నాడని, భూమి పంపకానికి సహకరించడం లేదని అదేవిధంగా చేసిన వ్యవసాయంలో ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని ఇద్దరి మధ్యలో గొడవ జరిగినప్పటికీ గ్రామ పెద్దలు వారికి నచ్చజెప్పిన కూడా వెంకటేష్ రవి పైన ద్వేషం పెంచుకొని సోమవారం మధ్యాహ్న సమయంలో నిద్రిస్తున్న రవి పై గుడ్డలితో దాడి చేసి చంపేయడం జరిగింది తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ రాంబాబు వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News