Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan review: వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

Jagan review: వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

పేషెంట్‌కు చికిత్స అందించడం తోపాటు.. వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేయాలన్న సీఎం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతికి చోటు ఉండకూడదని సీఎం జగన్ ఆదేశించారు. ఫిర్యాదు చేయడానికి టెలిఫోన్‌ నంబర్‌ ప్రతిచోటా ఉంచాలని, అలాగే సమర్థవంతమైన ఎస్‌ఓపీలను పెట్టాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలి, పీహెచ్‌సీలు, విలేజ్‌ క్లినిక్కుల పనితీరు ఇందులో కీలకం, ప్రివెంటివ్‌ కేర్‌లో మనం ఆశించిన లక్ష్యాలను అప్పుడే సాధించగలమన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో రిక్రూట్‌మెంట్‌ వ్యవస్ధ సమర్థవంతంగా పనిచేయాలి, ఒక ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీచేయాలి, ఎక్కడా కూడా సిబ్బంది కొరత అన్నది ఉండకూడదు, 4 వారాలకు మించి.. ఎక్కడా ఏ ఖాళీ కూడా ఉండకూడదని సీఎం ఆదేశించారు.

- Advertisement -

సీఎం ఆదేశాలమేరకు కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చామన్న అధికారులు. ఫస్ట్‌ఎయిడ్, స్నేక్‌ బైట్, ఐవీ ఇన్‌ఫ్యూజన్, ఇంజక్షన్, వూండ్‌ కేర్, డ్రస్సింగ్, బేసిక్‌ కార్డియాక్‌ లైఫ్‌ సపోర్ట్‌ లాంటి అంశాల్లో వారికి శిక్షణ ఇచ్చామన్న అధికారులు. అక్టోబరు22న ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకూ 1,39,97,189 మందికి సేవలు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ద్వారా సేవలందుకున్నవారిలో 35,79,569 మంది హైపర్‌ టెన్షన్‌తో, 24,31,934 డయాబెటిస్‌తో బాధపడతున్నట్టు గుర్తింపు. వీరికి మంచి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. పేషెంట్‌కు చికిత్స అందించడం తోపాటు.. వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేయాలన్న సీఎం. విలేజ్‌ క్లినిక్‌ స్ధాయిలో కంటి పరీక్షలు కూడా చేయాలన్న సీఎం. క్రమం తప్పకుండా ఈ పరీక్షలు చేయాలన్న ముఖ్యమంత్రి. సికిల్‌ సెల్‌ ఎనీమియాను నివారించే కార్యక్రమంపై సీఎం సమీక్ష. ఈ ఏడాది 6.68 లక్షలమందికి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపిన అధికారులు. ఈ నెలలోనే అల్లూరిసీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పరీక్షలు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించిన అధికారులు.

ఓరల్‌ హెల్త్‌లో భాగంగా సీఎం ఆదేశాల మేరకు ప్రతినెలా కూడా దంత వైద్యులు పీహెచ్‌సీలను సందర్శించేలా చర్యలు తీసుకున్నామన్న అధికారులు. ఈ సమయంలో దంత సమస్యల చికిత్సకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. టీబీ నివారణపైనా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు వెల్లడించిన అధికారులు. ప్రస్తుతం లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయిస్తున్నామన్న అధికారులు. అందరికీ పరీక్షలు చేయడంద్వారా బాధితులను గుర్తించి.. వారికి మంచి చికిత్స అందించే చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేయాలన్న సీఎం. ప్రతి కుటుంబంలో పుట్టే బిడ్డ దగ్గరనుంచి ప్రతి ఒక్కరికీ కూడా ఆరోగ్యశ్రీకార్డు ఇవ్వాలన్న సీఎం. క్యూ ఆర్‌ కోడ్‌ ఉన్న ఈ కార్డు ద్వారా వారి ఆరోగ్యవివరాలను ఇందులో నమోదు చేయాలన్న సీఎం.

మెడికల్‌ కాలేజీలపైనా సీఎం సమీక్ష.
ఈ విద్యాసంవత్సంలోనే ప్రారంభం కానున్న కొత్త మెడికల్‌ కాలేజీల్లో మౌలిక సదుపాయాలపై సీఎం సమీక్ష. మెడికల్‌ కాలేజీలు చరిత్రలో నిలిచిపోయే నిర్మాణాలని, ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కొత్త మెడికల్‌ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే తరగతులు. పాడేరు, పులివెందుల, ఆదోని కొత్త మెడికల్‌ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు. మిగిలిన కాలేజీల్లో కూడా పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించిన అధికారులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News