Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్యే శిల్పాకి వినతి

Srisailam: ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్యే శిల్పాకి వినతి

ఉద్యోగులకు శ్రీశైలంలోనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని..

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి, అమ్మవారి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు శ్రీశైలంలోనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఉద్యోగుల సంఘం తరుపున ఉద్యోగులు శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. శ్రీశైలం వచ్చిన ఎమ్మెల్యేను కలిసి దేవస్థానం ఉద్యోగులకు ఎంప్లాయిస్ మ్యూచవల్లి ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ పేరున ఇంటి స్థలాలను 33 సంవత్సరములకు లీజు పద్ధతిపై మంజూరు చేయించవలసిందిగా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం దేవస్థానం ఉద్యోగులు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి శాలువాతో సత్కరించారు ఆలయ అర్చకులు. ఎమ్మెల్యే శిల్పాకి వేదాశీర్వచనం అందజేశారు వేదపండితులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News