Monday, July 1, 2024
HomeదైవంYaganti: యాగంటి ఆలయ హుండీ లెక్కింపు

Yaganti: యాగంటి ఆలయ హుండీ లెక్కింపు

6 నెలల హుండీ ఆదాయం 36 లక్షలు

బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు ఈవో బి.చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో లెక్కించారు. హుండీ ద్వారా ఆలయానికి 35,93,974 రూపాయలు ఆదాయం లభించినట్లు ఈవో తెలిపారు. హుండీలో బంగారు, వెండికి సంబంధించిన వస్తువులు ఏమి రాలేదని తెలిపారు. ఈ హుండీ లెక్కింపు బాలాజీ స్వచ్ఛంద సంస్థకు చెందిన సభ్యులు, ఆలయ మాజీ పాలక మండలి అధ్యక్షుడు చైర్మన్ తోట బుచ్చిరెడ్డి, పాలక మండలి సిబ్బంది, కెనరా బ్యాంక్ సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ హుండీ ఆదాయం 6 నెలల కాలానికి చెందినదిగా ఈవో చంద్రశేఖరరెడ్డి తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News