Sunday, October 6, 2024
HomeతెలంగాణNIMS: సింగరేణి కార్మికులకు ప్రత్యేక కౌంటర్లు

NIMS: సింగరేణి కార్మికులకు ప్రత్యేక కౌంటర్లు

సింగరేణి ఉద్యోగులు అంటే మా ఉద్యోగులు అనే భావనతో సేవలు

సింగరేణి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల వైద్య సేవల కోసం హైదరాబాద్ లోని నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లను డైరెక్టర్ ఫైనాన్స్ పర్సనల్ ఎన్.బలరామ్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, జీఎం కో-ఆర్డినేషన్ ఎం.సురేష్ లు ప్రారంభించారు. ఔట్ పేషెంట్ బ్లాక్, మిలీనియమ్ బ్లాక్, స్పెషాలిటీ బ్లాక్లలో సింగరేణి ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓపీ కౌంటర్లను వారు ప్రారంభించారు. మెరుగైన వైద్య సేవల కోసం సింగరేణి ద్వారా రిఫర్ చేయబడిన సింగరేణి కార్మికులు, సీపీఆర్ఎంఎస్ మెడికల్ కార్డుల కలిగిన విశ్రాంత కార్మికులు అడ్మిషన్ కౌంటర్ల వద్ద మిగిలిన రోగులతో పాటు క్యూ లో ఎక్కువ సేపు వేచి చూసే అవసరం లేకుండా నేరుగా డాక్టర్లను సంప్రదించేందుకు లేదా అడ్మిట్ అయ్యేందుకు ఈ ప్రత్యేక సింగరేణి కౌంటర్లను తెరిచినట్లు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తెలియజేశారు. సింగరేణి విస్తరించిన సుదూర ప్రాంతాల నుంచి వైద్య సేవలకు వస్తున్న కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప స్పష్టం చేశారు. సింగరేణి ఉద్యోగులు అంటే మా ఉద్యోగులు అనే భావనతో సేవలందిస్తున్నామని తెలిపారు. నిమ్స్ ఆసుపత్రిలో అన్ని వైద్య విభాగాలలో ఆధునిక వైద్య సేవలు అందించడం కోసం అత్యాధునిక వైద్య సేవల యంత్రాలను సమకూర్చుకున్నామని, అనుభవజ్ఞులైన వైద్యులతో సేవలందిస్తున్నామని తెలిపారు. డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పర్సనల్ ఎన్ .బలరామ్ మాట్లాడుతూ… నిమ్స్ వారు సింగరేణి కార్మికుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం పట్ల హర్షం ప్రకటించారు. అలాగే నిమ్స్ ఆసుపత్రికి వచ్చిన రోగులు వారి సహాయకుల తాత్కాలిక వసతి కోసం ప్రత్యేక బిల్డింగును కేటాయించడం కూడా సంతోషకరమన్నారు. దీనిని త్వరలోనే వసతికి అనుకూలంగా మార్చడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇతర ఆసుపత్రులతో పోల్చినట్లయితే నిమ్స్ లో అతి తక్కువ రేటుతో అన్ని రకాల వైద్య సేవలను విశేష ఆనుభవం గల వైద్య నిపుణుల ద్వారా అందిస్తున్నారని, కనుక నిమ్స్ వైద్య సేవలను ఉద్యోగులు ఎంపిక చేసుకోవాలని, మెరుగైన వైద్య సేవలు పొందాలనీ పిలుపునిచ్చారు.

- Advertisement -


ఈ సందర్భంగా నిమ్స్ ఆస్పత్రిలోని అన్ని విభాగాలను అక్కడ గల ఆధునిక వైద్య సేవలను నిమ్స్ డైరెక్టర్ బీరప్ప డైరెక్టర్ ఫైనాన్సు శ్రీ ఎన్.బలరామ్ కు , జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ శ్రీ ఎం సురేష్ కు వివరించారు. ఈ కార్యక్రమానికి సింగరేణి డిప్యూటీ సీఎంవో డాక్టర్ బాలకోటయ్య సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలకోటయ్య, సింగరేణి పీఆర్వో ఎస్.శ్రీకాంత్, డీఎంఎస్ లు డాక్టర్ కెవి కృష్ణా రెడ్డి, డాక్టర్ లక్ష్మీ భాస్కర్, ఆర్థిక విభాగం అధికారులు శ్రీధర్, వెంకటేశ్వర రావు, సూపరింటెండెంట్ మోహన్, పీఆర్వో లక్ష్మి, మీడియా రిలేషన్ ఆఫీసర్ సత్యాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News