Sunday, October 6, 2024
HomeతెలంగాణHyd: 15 రోజులపాటు హ్యాండ్లూమ్ ఎక్స్ పో

Hyd: 15 రోజులపాటు హ్యాండ్లూమ్ ఎక్స్ పో

హైదరాబాద్ ప్యూపుల్స్ ప్లాజాలో..

హైదరాబాద్‌లో పీపుల్స్‌ ప్లాజాలో చేనేత దినోత్సవం సందర్భంగా 15 రోజుల పాటు నిర్వహించే నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్‌పోను రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలసి ప్రారంభించారు.

- Advertisement -

అనంతరం ప్రదర్శనలో ఉంచిన చేనేత వస్త్రాలను పరిశీలించారు. వాటి ప్రత్యేకతలు, ధరల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ వారు మాట్లాడుతూ…

చేనేత వస్త్రాలు మన జీవన విధానంతో ముడిపడి, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని సత్యవతి రాథోడ్ స్పష్టంచేసారు. జాతీయ వినియోగదారులను చేనేత వస్త్రాల వైపుకు ఆకర్షించడంతో పాటు చేనేత వస్త్రాల విక్రయాలను పెంచడం, చేనేత రంగాన్ని ప్రోత్సహించడం ఈ ఎక్స్‌పో ప్రధాన లక్ష్యం అన్నారు. తెలంగాణ ఉత్పత్తి చేస్తున్న చేనేత వస్త్రాలను దేశవ్యాప్తంగా మార్కెట్ కల్పించడానికి ఒక గొప్ప వేదిక ఈ ఎక్స్‌పోఅని తెలిపారు. మన నేతన్నల అద్భుతమైన నైపుణ్యం చేనేత వస్త్రాల ద్వారా తెలుస్తుందని పేర్కొన్నారు.

చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు ప్రజలు చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. ఈ ఎక్స్‌పోలో టీఎస్‌కో ఉత్పత్తులపై 20 నుంచి 30 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం ప్రదర్శనలో ఉంచిన చేనేత వస్త్రాల ను పరిశీలించారు. వాటి ప్రత్యేకతలు, ధరల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News