Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Mallapur: తండ్రికి బదులు తనయుడు

Mallapur: తండ్రికి బదులు తనయుడు

కోరుట్ల BRS అభ్యర్థిగా డా. సంజయ్

భారత రాష్ట్ర సమితికి చెందిన అభ్యర్థులు ఖరారు అయ్యారు. ప్రగతి భవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభ్యర్థులను ప్రకటించారు. కోరుట్ల నియోజకవర్గ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు డా.కల్వకుంట్ల సంజయ్ పేరును ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ మార్పు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది తమ వారసులను పోటీలో నిలపాలని భావించిన ఎవ్వరికి అవకాశం దక్కలేదు. కోరుట్లలో మాత్రమే వారసునికి అవకాశం దక్కింది. కోరుట్ల నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి, కేటీఆర్, కవిత, హరీష్ రావులకు సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. యువ నాయకుడు, డాక్టర్, సామజిక సేవకుడు అయిన సంజయ్ కి టికెట్ ఇవ్వడం పట్ల నియోజకవర్గం వ్యాప్తంగా అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News