Saturday, October 5, 2024
HomeతెలంగాణGodavarikhani: పేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ

Godavarikhani: పేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీలో చేరికలు

ట్రాక్టర్స్, డ్రైవర్స్ అండ్ లేబర్స్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు పట్టణంలో కార్పొరేటర్ మహంకాళి స్వామి, ఉమ్మెంతుల దేవేందర్ రెడ్డి, మేకల పోశం యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం మాయమాటలతో మోసం చేస్తున్నారని రానున్న ఎన్నికల్లో బిఅర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నిరంతరం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వ లింగస్వామి, కార్పొరేటర్ లు మహంకాళి స్వామి, ముస్తఫా, బీసీ సెల్ అద్యక్షులు గట్ల రమేష్, మాజీ కార్పొరేటర్లు మారెళ్లి రాజీరెడ్డి, చుక్కల శ్రీను, సాంబ మూర్తి, నాయిని ఓదెలు, కొప్పుల శంకర్, దులికట్ట సతీశ్, ట్రాక్టర్ అసోసియేషన్ నాయకులు ప్రవీణ్, గౌరయ్య, రాజయ్య, సతీశ్, క్రాంతి, నక్క శ్రీకాంత్, వెంకటస్వామి, సుదర్శన్, యూత్ కాంగ్రెస్ నాయకులు నాజైమొద్దిన్, కౌటం సతీశ్, గుడికండుల శివ, సిరీసెట్టి సతీశ్, ప్రవీణ్, శాంతికుమార్, సురేష్, దాసరి విజయ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News